ప్రాజెక్టు వివరాలు వెల్లడించిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు
మరికొద్ది రోజుల్లో కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకానున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు ఇవాళ (జూన్ 7న శనివారం) హైదరాబాద్లోని తెలంగాణభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై అధికార పార్టీ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎండగట్టారు. ఆ తప్పుడు ప్రచారంపై తోటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ నోరు మెదపకపోవటాన్ని హరీష్ రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి జీవధార అని అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా ఈ సంవత్సరం పంటలు బాగానే పండాయని చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు శుద్ధ అబద్ధమని హరీష్ రావు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒకటీ రెండు పియర్స్ కుంగినంత మాత్రాన మొత్తం ప్రాజెక్టే కొట్టుకుపోయిందనే రీతిలో సీఎం రేవంత్ గోబెల్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఆయన ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు.. తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు కల్పతరువు. సూర్యాపేట, కోదాడ దాకా నీళ్లు అందించి పంటలు పండేందుకు దోహదపడ్డాం. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 20 లక్షల 33 వేల 572 ఎకరాలకు సాగునీరు అందించాం. ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒక ఏడాది కరువొస్తే ఎస్సారెస్పీకి కూడా నీళ్లను రివర్స్ పంపింగ్ చేశాం. మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండీకి నీళ్లు తెచ్చి, అక్కడి నుంచి ఎస్సారెస్పీ స్టేజ్ 1కు నీళ్లిచ్చాం. ఎస్సారెస్పీ స్టేజ్ 2లో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దాకా నీరు సరఫరా చేశాం. కేసీఆర్ సర్కారు కాళేశ్వరం నీళ్లు పంపించి పంటలు కాపాడింది. ఇది వాస్తవమైన నివేదిక. నీటి పారుదల శాఖ అధికారులిస్తున్న రిపోర్ట్