Tuesday, June 10, 2025
spot_img

మానవత్వం చచ్చిపోయింది

Must Read

ఒక ఎమ్మెల్యే కన్నుమూశారు. ఆయన ఏ పార్టీ శాసన సభ్యుడు అనేది ముఖ్యం కాదు. ఆయన ఒక ప్రజా ప్రతినిధి. ఓ వైపు ఆ ఎమ్మెల్యే అంత్యక్రియలు జరుగుతున్నాయి. మరో వైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అది కూడా అంగరంగ వైభవంగా. సహచర శాసన సభ్యుడు చనిపోయిన విషయం తెల్లవారుజామునే తెలిసింది. అలాంటప్పుడు మంత్రుల ప్రమాణ స్వీకారాన్ని ఓ మూడు రోజులు వాయిదా వేస్తే ఏం మునిగిపోతుంది? చనిపోయిన ఎమ్మెల్యే ప్రస్తుత ముఖ్యమంత్రితో గతంలో కలిసి పనిచేసిన నాయకుడు. ఆ మాత్రం కూడా గౌరవం లేదా? ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా విచారకరం. దురదృష్టకరం కూడా. దీన్నిబట్టి.. మానవత్వ విలువలు చచ్చిపోయాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

  • బీవీఆర్ రావు
Latest News

మాగంటి గోపినాథ్‌కు ఎన్‌ఆర్‌ఐల నివాళి

జూన్ 8న ఆదివారం ఉదయం కన్నుమూసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత మాగంటి గోపీనాథ్‌కి ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) ఘనంగా నివాళులు అర్పించారు....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS