Friday, June 13, 2025
spot_img

పాకిస్తాన్‌కి జైశంకర్ హెచ్చరిక

Must Read

పక్క దేశం పాకిస్తాన్‌ను మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ మరోసారి హెచ్చరించారు. మరోసారి టెర్రర్ ఎటాక్ చేస్తే ఇండియా రిటన్ గిఫ్ట్ ఇవ్వటం తథ్యమని తేల్చిచెప్పారు. ప్రస్తుతం బ్రస్సెల్స్‌ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ ముగియలేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదం అనేది పాకిస్థాన్ జాతీయ విధానంలో భాగమని జైశంకర్ విమర్శించారు. ఇండియా యుద్ధ విమానాలను నాలుగింటిని కూల్చివేశామన్న పాకిస్తాన్‌ వ్యాఖ్యలపై ప్రశ్నించగా ఆయన స్పందించలేదు. ఈ సమాచారాన్ని సంబంధిత అధికారులే వెల్లడిస్తారని జైశంకర్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌లోని వైమానిక స్థావరాలు నేలమట్టమైన ఫొటోలు గూగుల్‌లో ఉన్నాయని చెప్పారు. పాకిస్థాన్ నిత్యం టెర్రరిస్టులకు షెల్టర్ ఇవ్వటం, ట్రైనింగ్ ఇవ్వటం పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. వేలాది మంది ఉగ్రవాదులు దక్షిణ సరిహద్దుల్లో ఉన్నారని జైశంర్ పేర్కొన్నారు.

Latest News

పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు

ఇజ్రాయెల్‌ తాజగా ఇరాన్‌పై ముందస్తు దాడులు చేసింది. న్యూక్లియర్ పవర్ ప్లాంటు, ఆర్మీ ప్రదేశాలు లక్ష్యంగా బాంబులతో విరుచుకుపడింది. ఇవాళ (జూన్ 13 శుక్రవారం) ఉదయం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS