Saturday, August 2, 2025
spot_img

కూటమి ప్రభుత్వ వేడుక రేపటికి వాయిదా

Must Read

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి (జూన్ 12 గురువారం) సరిగ్గా ఏడాది అయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సర్కారు ఇవాళ సాయంత్రం అమరావతిలో తలపెట్టిన వేడుకలను రేపటికి (జూన్ 13 శుక్రవారం) వాయిదా వేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో ఈ సభను జరపాలనుకుంది. అంతకుముందు ఈ మీటింగ్ పేరును ‘సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్’గా నిర్ణయించి తర్వాత మార్చారు. ఈ మేరకు గుంటూరు జిల్లా అమరావతిలో ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సంవత్సర కాలంలో ఏయే కార్యక్రమాలను అమలుచేశారో, వచ్చే నాలుగేళ్లలో ఏయే లక్ష్యాలను నిర్దేశించుకున్నారో ఈ సమావేశంలో చెప్పాలని భావించారు. ఈ ఉత్సవంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొనాల్సి ఉంది. కానీ.. అనూహ్య పరిస్థితుల్లో రేపటికి వాయిదా వేశారు.

Latest News

గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం

అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు వినతి ఈశాన్య భారత ప్రజలకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిని మరింత...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS