తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి సీఎంని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు. మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించిన నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆ సామాజికవర్గ ఎమ్మెల్యేలు పలువురు సీఎం రేవంత్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు.
