పాతబస్తీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
పాతబస్తీ మలక్పేట్ లోని ఓ అపార్మెంట్ లో హిందువుల పై జరిగిన దాడిని ఉద్దేశించి బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కలిసుందామా…. కలిసుందాం…. చంపుకుందామా… చంపుకుందాం, భారత దేశం మాది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాలక్పేట్ ఎలైట్ అపార్టుమెంట్ లోకి చొరబడి కొందరు ముస్లిం యువకులు దాడి చేసి మహిళలను భయబ్రాంతులకు గురి చేశారు. దింతో అపార్మెంట్ లో నివసించే బ్రహ్మానందం కు తీవ్ర గాయాలయ్యాయి. సైదాబాద్ సాయి నర్శింగ్ హోం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం బడితుడిని పరామర్శించిన అనంతరం పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ… పాతబస్తీలో కొందరు చట్టాన్ని గౌరవించడం లేదని… అధికారులు కూడా ఎంఐఎం కు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి, భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, కొత్తకాపు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.