Sunday, June 15, 2025
spot_img

‘అనంత‘లో దివ్యాంగుల రాష్ట్ర స్థాయి యోగా గ్రాండ్ సక్సెస్

Must Read

– ప్రతి ఒక్కరూ యోగాను రోజు పాటిస్తూ ఆరోగ్యాన్ని బాగుపరచుకోవాలి

– జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

– ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా సీఎం చంద్రబాబు చేస్తున్నారు

  • అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్

– నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, తదితరులు..*

– అనంతపురం నగరంలో దివ్యాంగులతో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. యోగాంధ్రలో భాగంగా అనంతపురం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో శనివారం ఉదయం దివ్యాంగులతో రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జడ్పి చైర్ పర్సన్, జాయింట్ కలెక్టర్, తదితరులచేత యోగ మాస్టర్ ట్రైనర్స్ యోగాసనాలు వేయించారు. దివ్యాంగులు, పింఛన్ దారులు, వృద్ధులు ఏ విధంగా యోగా చేయాలన్నది యోగా మాస్టర్ ట్రైనర్లు ఆసనాలు వేసి చూపించారు. ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జడ్పి చైర్ పర్సన్, జాయింట్ కలెక్టర్ కూడా ఆసనాలు వేసి దివ్యాంగులను ఉత్తేజపరిచారు.*

– *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను రోజు పాటిస్తూ ఆరోగ్యాన్ని బాగుగా పెట్టుకుందామన్నారు. ప్రతి ఒక్కరికి యోగా ఉపయోగంగా ఉంటుందన్నారు. అనంతలో దివ్యాంగుల రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమం చక్కటి అవగాహనతో ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రస్థాయిలో కార్యక్రమాన్ని అనంతపురంలో ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

దివ్యాంగులు, వికలాంగులు, పింఛన్ దారులు మొత్తం 2300 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. శిక్షణ ఇచ్చిన టీచర్లు, వెల్ఫేర్ అధికారులు అందరూ పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని విజయవంతం చేశారన్నారు. దివ్యాంగులు ఎవరెవరు ఎలాంటి ఆసనాలు చేయగలుగుతారో వాటిపై సూచనలు ఇస్తూ అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈనెల 21న వరల్డ్ రికార్డ్ లో భాగంగా యోగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ముందస్తుగానే సన్నాహాలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.*

– *ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21వ తేదీన విశాఖపట్నంలో దాదాపు 3 లక్షల మందితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కార్యక్రమం జరుపుకుంటున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీటీ స్టేడియంలో దాదాపు 5,000 మందికిపైగా పాల్గొని అదే రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అనంతపురంలో దివ్యాంగుల రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.*

– *ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ యోగా అనేది సంస్కృతిలో భాగంగా మనందరికీ లభించిన వరమన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వారి జీవితంలో యోగాసనాలు వేసే అలవాటుని ఏర్పాటు చేసుకోవాలని, యోగా వల్ల మన శరీరానికి ఆరోగ్యం, మనసుకు ప్రశాంతత, ఉత్తేజం, ఉల్లాసం లభిస్తాయన్నారు. యోగా గురించి భవిష్యత్ తరాలకు తెలియజేయాలని, మనం కూడా నిత్యం ఆచరించాలన్నారు.*

– *ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగులను, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను, యోగా మాస్టర్ ట్రైనర్లను ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జడ్పీ చైర్ పర్సన్, తదితరులు శాలువా కప్పి మెమొంటోలను అందజేసి సన్మానించారు.*

– *ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు, డిఆర్ఓ ఏ.మాలోల, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి వినోద్, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, ఆర్డీఓ కేశవనాయుడు, డిఆర్డిఏ పిడి మరియు సమగ్ర శిక్ష ఏపీసి శైలజ, మెప్మా పిడి విశ్వజ్యోతి, జిల్లా సైనిక్ సంక్షేమ శాఖ అధికారి పి.తిమ్మప్ప, ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ గురుస్వామిశెట్టి, బిసి వెల్ఫేర్ డిడి ఖుష్బూ కొఠారి, డిటిడబ్ల్యూఓ రామాంజనేయులు, డిఎండబ్ల్యూఓ రామసుబ్బారెడ్డి, ఆయుష్ డాక్టర్స్ డా.రామ్ కుమార్, డా.లాల్యనాయక్, యోగా గురువులు కృష్ణవేణి, ఆంజనేయులు, ఇంతియాజ్, రాజశేఖర్ రెడ్డి, చలపతి, దివాకర్, చెన్నకేశవులు, రవికుమార్, గురురాజారావు, తహసీల్దార్ హరికుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆయా శాఖల సిబ్బంది, దివ్యాంగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Latest News

సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో బాస్కెట్‌బాలే నంబర్ వన్

జిల్లా క్రీడల అధికారి సునీల్ రెడ్డిఖమ్మం జిల్లా వ్యాప్తంగా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సంస్థ నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో బాస్కెట్‌బాల్ క్రీడ అగ్రస్థానంలో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS