తాజా తేదీని ప్రకటించిన ఇస్రో
టెక్నికల్ ఇష్యూస్తో పలుమార్లు వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రకు సంబంధించిన తాజా తేదీని భారత అంతరిక్ష పరిశోధ సంస్థ(ఇస్రో) ఇవాళ(జూన్ 14 శనివారం) ప్రకటించింది. ఈ రోదసీ యాత్ర ఈ నెల 19న నిర్వహిస్తామని తెలిపింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా)కు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం జరగనుంది. దీని ద్వారా ఇండియా, పోలండ్, హంగేరీకి చెందిన నలుగురు ఆస్ట్రోనాట్లు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్(ఐఎస్ఎస్)కు చేరుకుంటారు. ఈ మిషన్కు మన వ్యోమగామి శుభాన్షు శుక్లా.. పైలట్గా వ్యవహరించనున్నారు.