- కేరళలోని చెంగల – నీలేశ్వరం మద్య 77కి.మీ టెండర్ను పొందిన సంస్థ
- ఎన్హెచ్ఏఐ 66లో నాణ్యత లేకుండా రహదారి నిర్మాణం
- రోడ్డు నిర్మాణం పై ఎన్హెచ్ఎఐ తీవ్ర అసంతృప్తి
- ఏడాది పాటు టెండర్లలో పాల్గొనకుండా నిషేధం విధించిన ఎన్హెచ్ఎఐ
ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయినా మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఎన్హెచ్ఏఐ ఉహించని షాక్ ఇచ్చింది. ఆ సంస్థ ఎన్హెచ్ఎఐ రోడ్ల టెండర్లలో ఏడది పాటు పాల్గొనకుండా నిషేధించింది. గతంలో దక్కించుకున్న పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. వివరాల ప్రకారం కేరళలోని చెంగల – నీలేశ్వరం సెక్షన్లోని ఎన్హెచ్-66కు సంబంధించి 77 కిలోమీటర్ల పనులను గతంలో మేఘా సంస్థ దక్కించుకోవడంతో పనులను కూడా పూర్తి చేసింది. అయితే ఈ పనులు జాతీయ రహదారుల స్థాయికి తగట్టు నాణ్యతతో వేయలేదని ఎన్హెచ్ఏఐ గుర్తించింది. రోడ్డు ఓ వైపు వంగిపోయినట్లుగా ఉండటంతో పాటు సరైన డ్రైనేజీ వ్యవస్థను నిర్మించకపోవడం పై ఎన్హెచ్ఏఐ గుర్తించడం జరిగింది. ఈ రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించిన ఎన్హెచ్ఏఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రూ. 9కోట్ల వరకు జరిమానా విధించింది. కాసరగోడ్ జిల్లాలోని పనులు జరుగుతున్న సమయంలో వంతెనల నిర్మాణాలు కూలిపోవడంతో పాటు వాటిపై నాయ్ ఇంజినీర్లు దర్యాప్తు సరైన డిజైన్ లేకపోవడం, నాణ్యతగా పనులు చేయకపోవడాన్ని గుర్తించి రిపోర్టు తయారుచేశారు. మేఘా సంస్థ ఈ కాంట్రాక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ప్రకారం పొందింది. రోడ్ నిర్మించడమే కాకుండా 15 సంవత్సరాలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పుడు ఆ రోడ్ను మళ్లీ ప్రమాణాల ప్రకారం నిర్మంచాల్సి ఉండగా దాని కంపెనీ పాటించలేదు. ఈ నేపథ్యంలో మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గట్టి షాక్ ఇచ్చింది. ఏడాది పాటు టెండర్లలో పాల్గొనకుండా నిషేధం విధిస్తూ అదేశాలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మేఘా ఇంజినీరింగ్ ఎక్కువగా ఎత్తిపోతల ప్రాజెక్టుల పనుల్ని చేస్తుంది. అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనూ మేఘా చేపట్టిన పలు ప్రాజెక్టులపై అనేక వివాదాలున్నాయి. కాని ఆదిశగా మాత్రం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.