రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 6180 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సౌత్ సెంట్రల్ రైల్వేలో 89 పోస్టులు, రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 47 ఖాళీలు, రైల్ వీల్ ఫ్యాక్టరీలో 36 ఉద్యోగాలు ఉన్నాయి. 2025 జూన్ 28 నుంచి జులై 28 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఒక అభ్యర్థి ఒక ఆర్ఆర్బీకి మాత్రమే దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాలతో కూడిన ప్రకటన జూన్ 28న విడుదల కానుంది. సౌత్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ కోసం www.rrbsecunderabad.gov.inను సందర్శించొచ్చు.