— భారత ఎన్నికల సంఘం ఉప సంచాలకులు పి.పవన్
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఎన్నికలు కీలక పాత్ర వహిస్తాయని, అటు వంటి ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడంలో మీడియా కీలక పాత్ర వహిస్తుందని భారత ఎన్నికల సంఘం ఉప సంచాలకులు పి.పవన్ పేర్కొన్నారు. ప్రాంతీయ స్థాయిలో భారత ఎన్నికల సంఘం కమ్యునికేషన్ ప్రభావాన్ని, పరిధిని పెంచడం ద్వారా ఓటర్లను చైతన్య పర్చడంలో ప్రాంతీయ మీడియా ప్రతినిధులు సహాకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అద్యక్షతన శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా ప్రతినిధులతో ముఖాముఖి చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భారత ఎన్నికల సంఘం డిప్యూటీ డైరెక్టర్ పి పవన్ ముఖ్యఅతిధిగా పాల్గొని మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి జరిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా స్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేసేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన 23 నూతన కార్యక్రమాలు, ఓటర్లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బందికి కల్పిస్తున్న సదుపాయాలు, ప్రక్రియాత్మక సంస్కర్ణలు, చట్టపరమైన చర్యలు, ఇ.సి.ఐ. నూతన ఆవిష్కరణలు మరియు వనరులను వివరించారు. ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాల్లో భాగంగా దాదాపు 20 ఏళ్ల తర్వాత ఉప ఎన్నికలకు ముందు ప్రత్యేక సార్వత్రిక నమోదు (SSR) కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఓటర్ సమాచార స్లిప్లు మరింత ఉపయోగకరంగా మారనున్నాయని, ఓటర్ సీరియల్ నంబర్ మరియు పార్ట్ నంబర్ను స్పష్టంగా చూపించనున్నామన్నారు. మరణాల నమోదుకు సంబంధించిన డేటాను RGI డేటాబేస్ నుండి సేకరించి, ధృవీకరణ తర్వాత ఓటరు జాబితాలో మార్పులు చేయడం జరుగుతుందన్నారు. ఒక్క పోలింగ్ కేంద్రానికి గరిష్ఠంగా 1200 ఓటర్లకే అనుమతి నిస్తున్నామని, ఓటర్లకు మొబైల్ డిపాజిట్ సదుపాయాన్ని, అపార్టుమెంట్లు/కాలనీల్లో అదనపు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రచార దూర పరిమితి పోలింగ్ కేంద్ర ప్రవేశ ద్వారానికి 100 మీటర్లకు తగ్గించడం జరిగిందని, CEO/DEO/ERO స్థాయిలో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో మొత్తం 4,719 సమావేశాలను నిర్వహించడం జరిగిందని, ఈ సమావేశాల్లో 28,000 మందికి పైగా రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. అఖిల భారత, రాష్ట్ర స్థాయి పార్టీ నేతలతో సమావేశాలను (AAP, BJP, BSP, CPI(M), NPP) నిర్వహించడం జరిగిందని, ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ (IIIDEM) లో బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి కి చెందిన బూత్ స్థాయి ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు.

ఎన్నికల సంఘం ప్రక్రియాత్మక సంస్కర్ణల్లో భాగంగా ఓటర్ల ట్రెండ్ రిపోర్ట్ (VTR), ఇండెక్స్ కార్డులు మరియు గణాంక నివేదికల డిజిటలైజేషన్ ద్వారా వేగవంతంగా వ్యాప్తి చేయడం జరుగుచున్నదన్నారు. ECINET అనే కొత్త సమగ్ర డాష్బోర్డ్ ను ప్రారంభించి, 40కి పైగా యాప్లు/వెబ్సైట్ల స్థానంలో ఒకే యాప్ ను రూపొందించి అన్ని సేవలను ఒకే చోట ఒకే సమయంలో అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. యూనిక్ EPIC నంబర్ పద్ధతిని అమలు పర్చడం ద్వారా డూప్లికేట్ EPIC నంబర్ల సమస్య పరిష్కరించడం జరిగిందన్నారు.

ఎన్నికల సిబ్బందికి సంబంధించి బూత్ స్థాయి అధికారులకు స్టాండర్డ్ ఫోటో ఐడీ కార్డులను జారీ చేయడం జరుగుతుందని, డిల్లీ IIIDEM లో 3,000 మందికి పైగా బూత్ స్థాయి సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, రాబోయే సంవత్సరాల్లో లక్షకు పైగా BLO సూపర్వైజర్లకు శిక్షణ నివ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. డిల్లీ IIIDEM లో CEO కార్యాలయాల మాధ్యమం ద్వారా 36 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల మీడియా/కమ్యూనికేషన్ అధికారులకు మరియు బీహార్ పోలీసు అధికారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు.

ECI చట్టపరమైన చట్రాన్ని బలోపేతం చేయడానికి మరియు చట్టాల పునఃపరిశీలన కోసం న్యాయవాదులు, CEOల జాతీయ సదస్సును నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రాతినిధ్య చట్టాలు (1950, 1951), ఓటర్ల నమోదుకు నియమాలు (1960), ఎన్నికల నిర్వహణ నియమాలు (1961), ECI జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు మొత్తం 28 రంగాల భాగస్వాములను (ఓటర్లు, అధికారులు, పార్టీలు, అభ్యర్థులు మొదలైనవి) గుర్తించడమైందన్నారు. బయోమెట్రిక్ హాజరు అమలుతో పాటు ఈ-ఆఫీస్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు CEOలతో తరచూ సమావేశాలు నిర్వహించడం జరుగుచున్నదన్నారు.
అదే విధంగా భారత ఎన్నికల సంఘం మరియు ఎన్నికల ప్రక్రియకు సంబందించిన సమాచారాన్ని పలు వెబ్ సైట్ల ద్వారా పౌరులకు అందుబాటులోకి తేవడం జరిగిందని ఆయన తెలిపారు. అధికారిక వెబ్సైట్: https://www.eci.gov.in/, SVEEP వెబ్సైట్: https://www.eci.gov.in/sveep-website , అపోహల వాస్తవాలు: https://mythvsreality.eci.gov.in/ , ఫోటో గ్యాలరీ: https://www.eci.gov.in/photo-gallery, ప్రచురణలు & మీడియా: https://www.eci.gov.in/media-publication, గణాంక నివేదికలు: https://www.eci.gov.in/statistical-reports ,IIIDEM వెబ్సైట్: https://iiidem.eci.gov.in/ తదితర వెబ్ సైట్లతో పాటు సామాజిక మాధ్యమ వేదికలు: X (Twitter), Facebook, YouTube, Instagram, Public App, WhatsApp ఛానల్, LinkedIn ద్వారా తాజా సమాచారాన్ని వ్యాప్తి చేయడం జరుగుచున్నదని ఆయన తెలిపారు.
ఈ ఇష్టాగోష్టి చర్చా కార్యక్రమంలో ఎన్నికల ప్రక్రియకు సంబందించి పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాదానం చెప్పారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ సి.ఇ.ఓ. ఎ.వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ సి.ఇ.ఓ. పి.తాతబ్బాయితో పాటు పలు మాద్యమాలకు చెందిన మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.