ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా మన దేశంలో ఫస్ట్ షోరూమ్ను జులైలో ప్రారంభించనుంది. వచ్చే నెల ప్రథమార్థం కల్లా ముంబైలో ఓపెన్ కానుంది. ఇండియా ఆర్థిక ముంబై తర్వాత జాతీయ రాజధాని ఢిల్లీలోనూ సేల్స్ సెంటర్ను ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. చైనాలో ఉన్న తన ఫ్యాక్టరీలో తయారుచేసిన కార్లతో టెస్లా ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతోందని సమాచారం. ఆ కంపెనీకి చెందిన ‘మోడల్ వై’ రేర్ వీల్ డ్రైవ్ ఎస్యూవీ కార్లు ఇప్పటికే మన దేశానికి చేరుకున్నాయని తెలుస్తోంది. ‘మోడల్ వై’ అనేది ప్రపంచంలో ఎక్కువగా విక్రయమవుతున్న విద్యుత్ కారు. దీన్ని అమెరికాలో 44,990 డాలర్లకు అమ్ముతోంది. ఇండియాలో ఈ రేటు 56 వేల డాలర్ల రేంజ్లో ఉండొచ్చని భావిస్తున్నారు.