ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో ఇండియా 96 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో ఇండియా 471 రన్నరులకు ఆలౌట్ కాగా ఇంగ్లండ్ 465 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్ మూడో రోజు ఇండియా 2వ ఇన్నింగ్స్ ప్రారంభించి ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 90 రన్నులు చేసింది. కేఎల్ రాహుల్ 47 పరుగులు, గిల్ 10 రన్నులతో క్రీజ్లో ఉన్నారు. అండర్సన్-టెండుల్కర్ టోర్నీలో భాగంగా ఇండియా ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. 5 టెస్టుల సిరీస్లో ఇప్పుడు ఫస్టు టెస్ట్ జరుగుతోంది. ఈ మ్యాచ్.. లీడ్స్లో జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్లో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు.