Wednesday, August 20, 2025
spot_img

పాకిస్థాన్‌ జట్టు భారత్‌కు రావొచ్చు

Must Read

భారత క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడి

2025 ఆసియా హాకీ టోర్నమెంట్‌కు భారత్‌(India) ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నమెంట్‌లో ఆగస్టు 27న ప్రారంభమై సెప్టెంబర్‌ 7న ముగుస్తుంది. భారత్‌లోని బిహార్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. అయితే ఇటీవల భారత్‌- పాకిస్థాన్‌ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌ హాకీ జట్టు ఇక్కడికి రావడంపై కొద్దిరోజులుగా సందిగ్ధత నెలకొంది. దీనిపై భారత క్రీడా మంత్రిత్వ శాఖ కీలక అప్డేట్‌ ఇచ్చింది.ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌ పాల్గొనడంపై భారత్‌కు ఎలాంటి అభ్యంతరం లేదని తాజాగా పేర్కొంది. ఈ విషయంలో పాకిస్థాన్‌ హాకీ జట్టు భారత్‌కు రావడంపై షరతులు లేవని తెలిపింది. ‘భారత్‌లో ఏ టోర్నమెంట్‌లోనైనా ఆడేందుకు ఏ జట్టుకు కూడా మేం వ్యతిరేకం కాదు. కానీ, ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మాత్రం మా వైఖరి వేరుగా ఉంటుంది’ అని క్రీడా మంత్రిత్వశాఖ అధికారి ఒకరు మీడియాతో చెప్పారు. కాగా ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ ఇంకా రిలీజ్‌ కావాల్సి ఉంది.

Latest News

హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేసిండ్రు..

హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్ హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS