సంగారెడ్డికి చెందిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి జక్కా వెంకటేశం, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని జక్కా వెంకటేశంకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా జక్కా వెంకటేశం మాట్లాడుతూ, “చదువుకునే వయసులోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక టెక్నాలజీపై పట్టు సాధించడం నా భవిష్యత్ లక్ష్యాలకు ఎంతో బలాన్నిస్తుంది. ఈ బూట్ క్యాంప్ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలను నా ఉన్నత చదువుల్లో ఉపయోగించుకొని, టెక్నాలజీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకుంటున్నాను. ఇంత చిన్న వయసులోనే నాకు ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ 2.0 ఆగస్టు 11, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686, 733 111 2688.