జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ బిజినెస్ అసోసియేట్ సాయి సృజన్ కుమార్, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని సాయి సృజన్ కుమార్కు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా సాయి సృజన్ కుమార్ మాట్లాడుతూ, “మారుతున్న కాలానికి అనుగుణంగా ఇన్సూరెన్స్ రంగంలోనూ సాంకేతికతను అందిపుచ్చుకోవడం అత్యవసరం. ఈ AI బూట్ క్యాంప్లో నేర్పిన నైపుణ్యాలు, కస్టమర్ల అవసరాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, వారికి మెరుగైన సేవలను అందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నా వృత్తిపరమైన కార్యకలాపాలలో సృజనాత్మకతను, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ శిక్షణ ఒక బలమైన పునాది వేసింది. ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ 2.0 ఆగస్టు 11, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686, 733 111 2688.