Thursday, August 14, 2025
spot_img

సెప్టెంబర్ 27 నుంచి టూరిస్ట్ పోలీస్ సేవలు ప్రారంభం

Must Read

తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగ భద్రత, సౌకర్యాల మెరుగుదలకు కొత్త అడుగు వేసింది. రాష్ట్రంలో ప్రత్యేక టూరిస్ట్ పోలీస్ విభాగంను ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త శాఖ సేవలు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా, సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ వెల్లడించారు. టూరిజం శాఖ–పోలీస్ శాఖల సమన్వయంతో జరిగిన సమావేశంలో పర్యాటక ప్రాంతాల భద్రత, అభివృద్ధిపై చర్చ జరిగింది. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ, తొలి దశలో 80 మంది పోలీసు సిబ్బందిని టూరిజం శాఖకు కేటాయించనున్నట్లు తెలిపారు.

మొదటి విడతలో నాగార్జునసాగర్, బుద్ధవనం, భద్రాచలం, అనంతగిరి, రామప్ప, యాదాద్రిగుట్ట, సోమశిల, అమ్రాబాద్, పోచంపల్లి వంటి రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక కేంద్రములలో టూరిస్ట్ పోలీసులు విధులు నిర్వహించనున్నారు. పర్యాటకులకు మార్గనిర్దేశం, భద్రత కల్పించడం, అత్యవసర సాయం అందించడం వీరి ప్రధాన బాధ్యతగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Latest News

పాకిస్థాన్ రాకెట్‌ ఫోర్స్‌ ఏర్పాటు

‘ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌’ క్షిపణుల దెబ్బ తిన్న పాకిస్థాన్‌ ఇప్పుడు కొత్త రాకెట్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయబోతోంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన కార్యక్రమంలో ఆ దేశ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS