ఆస్పత్రి మొదటి అంతస్తులు షార్ట్ సర్క్యూట్.
- ఐసీయూ, జనరల్ వార్డ్, ఆపరేషన్ థియేటర్ పూర్తిగా దగ్ధం.
- రెండు అంతస్తులో గాఢ నిద్రలో 150 మంది విద్యార్థులు.
- ప్రాణాలు అరచేతులో పెట్టుకొని రోడ్లమీదకి.
- తప్పిన పెను ప్రమాదం.. బిల్డింగ్ కు ఫైర్ సేఫ్టీ అనుమతులే లేవు.
- ఒకే బిల్డింగ్ లో హాస్పిటల్, భవాని నర్సింగ్ హోమ్ పేరుతో నిర్వహణ.
- అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారో.?
అది అర్ధరాత్రి సమయం.. పట్టణం అంతా నిర్మానుష్యంగా ఉన్న సమయంలో హాస్పిటల్, విద్యార్థులు ఉన్న బిల్డింగ్ లో అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతాన ఒక్కసారిగా మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో విద్యార్థులు వారి ప్రాణాలను అరచేతిలో పట్టుకొని పెద్ద ఎత్తున అరుపులు కేకలతో రోడ్డుపైకి వచ్చిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ హెల్తి ఫై హాస్పిటల్ బిల్డింగ్ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో నాలుగు అంతస్తుల భవనం అయిన హెల్తి ఫై ఆస్పత్రి మొదటి అంతస్తులు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి పెద్ద ఎత్తున పొగ అలుముకుంది. ఆ సమయంలో మొదటి అంతస్తు ఆసుపత్రిలో పేషెంట్లు ఎవరు లేరు. కానీ రెండవ అంతస్తులు 150 మంది విద్యార్థులు గాఢ నిద్రలో ఉన్నారు.

ఆపరేషన్ థియేటర్ ముఖ్యమైన పరికరాలు దగ్ధం :
మతకాల చలపతిరావు మేనేజింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో హెల్తి ఫై హాస్పిటల్ ఏర్పాటు చేశారు. అదే హాస్పిటల్ బిల్డింగ్ రెండు, మూడవ అంతస్తులు జిఎన్ఎమ్, బిఎస్సి నర్సింగ్ చదువుతున్న సుమారు 150 మంది పైగా విద్యార్థులు ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ కౌంటర్, డాక్టర్ల ఒపి రూమ్ లు, పేషెంట్లు, పేషంట్ల వెంట వచ్చే బంధువుల కొరకు వెయిటింగ్ హాల్ లో చైర్లు ఏర్పాటు చేయాగా, మొదటి అంతస్తులు ఆపరేషన్ థియేటర్, ఐసియు,జనరల్ వార్డు,వెంటి లెటర్,ఏసీ లు, ఓటి టేబుల్, ఓటి లో సామాన్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధం అయ్యాయి.
రెండు అంతస్తులలో గాఢ నిద్రలో విద్యార్థులు :
అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో నాలుగు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెంది దట్టమైన పొగలు వ్యాపించిన సమయంలో విద్యార్థులు గాఢనిద్రలో ఉన్నారు. రెండవ అంతస్తులలో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా వారి ప్రాణాలను అరచేతిలో పట్టుకొని గట్టిగా అరుపులు కేకలతో బిల్డింగ్ పై నుండి క్రిందికి దిగారు. బిల్లింగ్ నిర్వాహకులు ఫైర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి ఫైర్ పోలీసులు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇదే సమయంలో హాస్పిటల్ నిర్వాహకులు, విద్యార్థులతో అందులో ఉన్న సామాన్లను బయటకు మోయించారు. ఫైర్ అధికారులు ఈ బిల్డింగుకు ఎన్ఓసి కూడా ఇవ్వలేదని, బిల్డింగ్ నిర్మాణం ఫైర్ నాన్స్ ప్రకారం నిర్మించకపోవడంతోనే అనుమతులు ఇవ్వనట్లు అధికారులు తెలిపారు. మొదటి అంతస్తులోనే మంటలు వ్యాపించి అందులో ఉన్న పరికరాలన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. అదే మంటలు రెండు, మూడవ అంతస్తు చేరి ఉంటే ఎంత పెద్ద ఘోరం జరిగి ఉండేదో ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. ఈ ప్రమాదంపై కళాశాల యజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు లేటుగా సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఉదయం కళాశాల వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున చేరుకొని తమ బిడ్డలను చూసుకొని కన్నీరు మున్నీరయ్యారు.ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా జిల్లా ఉన్నతాధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

హెల్తి పై హాస్పిటల్ పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి ఫిర్యాదు :
సూర్యాపేట పట్టణములోని జమ్మిగడ్డలో గల హెల్తిపై హాస్పటల్ లో షార్ట్ సర్క్యూట్ అయ్యే పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడి, భవాని నర్సింగ్ హోమ్ విద్యానభ్యసిస్తున్న విద్యార్ధిని, విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రమాదం తప్పినది. ఫైర్ సెఫ్టి, మౌళిక సదుపాయోగాలు సరిగ్గాలేని అట్టి హస్పటల్ త్వరితగతిన చర్యలు తీసుకోవాలని లంబాడి విద్యార్థి సేన ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరావత్ బాలు నాయక్, శివ నాయక్, హరీష్ నాయక్ తదితరులున్నారు.