బాలీవుడ్ నటుడు, నిర్మాత ఆమిర్ ఖాన్ ఇవాళ (జూన్ 24 మంగళవారం) రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతిభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్ వేదికగా తెలిపింది. ఆమిర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. తొలి రోజు నుంచే సానుకూల స్పందనను సొంతం చేసుకుంది. ఈ మూవీని ఢిల్లీలో ఒలింపిక్ ఛాంపియన్ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమిర్ ఖాన్ రాష్ట్రపతిని కలిశారు. ఈ భేటీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సైతం పాల్గొన్నారు.
