తెలుగు సాహిత్య విమర్శకు పెద్దన్నగా ఆచార్య ఎస్.వి.రామరావును చెప్పవచ్చు.1973లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం నుంచి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, వక్త, విమర్శకులు, పరిశోధకులు, సినీ కవి డాక్టర్.సి.నారాయణ రెడ్డి పర్యవేక్షణలో తెలుగు సాహిత్య విమర్శ అనే అంశంపై పరిశోధన చేసి 1974లో పుస్తకంగా వెలువరించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అది తెలుగు సాహిత్య విమర్శలో పరిశోధన చేసేవారికి మార్గదర్శకంగా నిలుస్తుంది.

ఆచార్య ఎస్వీ రామారావు జూన్ 5, 1941లో శ్రీమతి రామచూడమ్మ, సూగూరు వాసుదేవరావు పుణ్య దంపతులకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత వనపర్తి జిల్లాలో జన్మించారు.వారి పత్నీ పేరు స్వయంప్రభ, వారికి ఇద్దరు సంతానం ఒక అమ్మాయి భావన, ఒక అబ్బాయి సాయి గిరిధర్
ఆచార్య ఎస్వీ.రామరావు బాల్యం లో నాల్గవ తరగతి వరకు శ్రీ రంగ పురంలో చదివారు.ఐదవ తరగతి నుండి హెచ్.ఎస్.సి వరకు వనపర్తి లో చదివారు.పి.యు.సి.డిగ్రీ బి.ఏ.హైదరాబాద్ లోని నిజాం కళాశాల నుండి పూర్తి చేశారు.ఎం.ఏ(1964) ,పి.హెచ్.డి(1973) ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేశారు.
విద్యార్హతలు:-
- డిప్లమా ఇన్ జర్నలిజం ( 1973 )
- హిందీ భూషణ్ (1965 )
1966 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం లెక్చరర్ గా చేరి 1976 లో రీడర్ గా,1987 లో ప్రొఫెసర్ గా పదోన్నతులు పొంది ఏప్రిల్ 2001 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ గా 35 సంవత్సరాల ఉద్యోగ బాధ్యతల నుండి పదవీ విరమణ పొందారు. ఎంతో మంది తెలుగు సాహిత్యంలో పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న, ప్రముఖ కవులు, రచయితలు, తెలుగు పండితులు, తెలుగు లెక్చరర్ లు, తెలుగు ప్రొఫెసర్ లను,పత్రిక సంపాదకులకు ఆచార్య ఎస్వీ.రామరావు తయారు చేశారు.తెలుగు విశ్వవిద్యాలయం సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య నిత్యానంద రావు ఆచార్య ఎస్వీ.రామరావు గారి శిష్యులు.15 మంది ఎం.ఫిల్ సిద్ధాంత వ్యాసాలు,19 పరిశోధన గ్రంథాలకు మార్గదర్శనం ( సూపర్ వైజింగ్) చేశారు.

ఆచార్య ఎస్వీ.రామరావు రచనలు:-
సాహిత్య విమర్శలు :- 1.తెలుగులో సాహిత్య విమర్శ (1974 )
2.శతాబ్ది కవిత ( 2009 )
3.విశ్వనాథ దర్శనం ( 2011 )
వ్యాస సంపుటులు:-
1.అన్వీక్షణం (1984 )
2.సమవీక్షణం ( 1992 )
3.అభివీక్షణం (1998 )
4.కావ్యామృతం ( 2004)
5.మనోవీక్షణం (2006 )
పీఠికలు:-
1.కృత్యాలోకనం
2.గ్రంథావలోకనం ( 2014 )
వ్యాఖ్యానాలు:-
1.నన్నయ దర్శనం ( 1998 )
2.కర్ణపర్వం – ద్వితీయాశ్వాసం (2005 )
3.భీమేశ్వర శతకం ( 2006 )
సాహిత్య చరిత్రలు:-
1.పాలమూరు సాహితీ వైభవం ( 2010 )
2.పాలమూరు ఆధునికయుగ కవుల చరిత్ర ( 2012 )
3.తెలుగు సాహిత్య చరిత్ర ( 2012 )
4.తెలంగాణ సాహిత్య చరిత్ర ( 2014 )
5.తెలంగాణ ప్రాచీన సాహిత్య కరదీపిక ( 2014 )
6.మా ఊరి కవులు ( 2014 )
7.తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం ( పరివర్ధిత ముద్రణ – 2015 )
8.వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర (2017 )
9.సమగ్ర తెలుగు సాహిత్య చరిత్ర (2017 )
కథలు, కవితలు:-
సాహితీ కదంబం ( 2010 )
ఇతరాలు:-
1.శ్రీ సత్యసాయి అవతారం – దశావతార గాథలు ( 2005 )
2.పరిశోధనోత్సవం (2006 )
3.నూటపది వసంతాల శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం (2010 )
4.తెలుగు భాషా ప్రాచీనత- విశిష్టత (2016 )
5.బూర్గుల రామకృష్ణారావు (2018 )
6.తెలంగాణ సినిమా బంగారు కాంతులు (2018 )
అవార్డులు:-
1.ఉత్తమ విమర్శ అవార్డు (1994 ) తెలుగు విశ్వవిద్యాలయం
2.సహరిదయ ( వరంగల్ ) లిటరరీ అవార్డ్ ( 2001 )
3.విశ్వసాహితి అవార్డు (2001 )
4.దాశరథి అవార్డు, ఉమ్మెత్తుల అవార్డు
5.జివిఎస్ సాహితీ ప్రీతమ్ అవార్డు ( 2007 )
6.ఇర్వెంటి అవార్డు (2009 )
7.బూర్గుల అవార్డు (2011 )
8.దివాకర్ల అవార్డు (2011 )
ప్రచురణలు:-
1.30 పుస్తకాలు
2.100 పరిశోధన వ్యాసాలు
3.సినిమా రివ్యూస్
విజిటింగ్ ఫెలో:-
కాకతీయ విశ్వవిద్యాలయం ( 2002,2004,2005 )
గెస్ట్ ఫ్యాకల్టీ:-
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ( 2003,2004 )
అకాడమీక్ హోదా:-
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు, ఛైర్మన్
ఉస్మానియా విశ్వవిద్యాలయం లో నిర్వహించిన పదవులు:-
1.బోర్డ్ ఆఫ్ స్టడీస్ ( 190,96-98 )
2.ఢీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ (1999-2001 )
3.కో ఆర్డినేటర్ డిఆర్ఎస్ (1994-96)
4.నేషనల్ సెమినార్ డైరెక్టర్ (1995 )
5.రిప్రెస్ కోర్సు ఫర్ కాలేజ్ టీచర్స్ (1997,2000)
6.విద్యార్థి సంఘం సలహాదారులు ( 1976-77 & 1985-87 )
7.బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులు
ఇతర విశ్వవిద్యాలయాలు:-
1.బెంగళూర్ విశ్వవిద్యాలయం ( 1992-97 )
2.బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ( 1997-99 )
3.పుట్టపర్తి (1998-2000 )
4.కాకతీయ విశ్వవిద్యాలయం ( 1992-94-1999-2001 )
ఎడిటర్ మరియు కోర్సు రైటర్:-
ఉస్మానియా విశ్వవిద్యాలయం యు.జి.,పి.జి (1977-2010 )
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మరియు ఓపెన్ యూనివర్సిటీ:-
1.ఎస్కెడిఆర్ విశ్వవిద్యాలయం పి.జి.(2001)
2.బెంగళూర్ విశ్వవిద్యాలయం (2000 )
3.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజి (2003 ) పిజి (2006 )
తెలుగు విశ్వవిద్యాలయం గతంలో పొట్టి శ్రీరాములు ప్రస్తుతం సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం, హైదరాబాదు (2006 )

నిత్య విద్యార్థిగా ఆచార్య ఎస్వీ.రామరావు:-
2001 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ ఫ్యాకల్టీ, డీన్ గా పదవీ విరమణ చేసినప్పటికీ నుండి నిత్య విద్యార్థిగా సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అంటారు.అక్షరాల ఆచార్య ఎస్వీ.రామరావు అన్ని జిల్లాల చరిత్రలను, తెలంగాణ సాహిత్య చరిత్రను, తెలుగు సాహిత్య చరిత్ర ను వెలువరిస్తూ ఎంతో మంది పరిశోధకులను ఆదర్శంగా నిలుస్తున్నారు.తెలుగు సాహిత్యంలో లబ్ధి ప్రతిష్టులైన తెలుగు పండితులు, తెలుగు లెక్చరర్ లు, తెలుగు ప్రొఫెసర్ లు ఎంతో మంది తెలుగు సాహిత్యాభివృద్దికు కృషి చేస్తున్నారు.
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వలస జిల్లాగా, వెనుకబడిన జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత వనపర్తి జిల్లాలో జన్మించి అంచెలంచెలుగా దేశ వ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు సాహిత్య విమర్శకు, తెలుగు సాహిత్య, సాంస్కృతిక, పరిశోధన రంగంలో తమకంటూ ఒక స్థానాన్ని పదిల పరుచుకున్న ఆచార్య ఎస్వీ.రామరావు తెలుగు సాహిత్య రంగంలో విమర్శలు గా ప్రసిద్ధి.
డాక్టర్. ఎస్. విజయ భాస్కర్.,
అధ్యక్షులు.,
హైదరాబాద్ ఓల్డ్ సిటీ రైటర్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (హౌకా),
స్టేట్ రిసోర్స్ పర్సన్ తెలంగాణ (తెలుగు)
సైదాబాద్, హైదరాబాద్-59.
9290826988