ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. అడ్లూరి లక్షణ్ కుమార్కి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
