Wednesday, June 25, 2025
spot_img

‘సుపరిపాలనలో తొలి అడుగు’ సమావేశానికి పూర్తయిన ఏర్పాట్లు

Must Read

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు సుపరిపాలనలో తొలిఅడుగు పేరిట రాష్ట్ర సచివాలయం వెనుక వైపు సోమవారం సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు,వివిధ శాఖల కార్యదర్శులు,శాఖాధి పతులు,జిల్లా కలెక్టర్లు, ఎస్పిలు,కూటమి నేతలు ఎంపి,ఎంఎల్ఏ,ఎంఎల్సిలు తదితరులు పెద్ద ఎత్తున ఈకార్యక్రమంలో పాల్గోనున్నారు.

ఈ సమావేశంలో ప్రధానంగా ఏడాది కాలంలో సాధించిన అభివృద్ధిపై చర్చించడం తోపాటు భవిష్యత్ కార్యాచరణపై ఈసమావేశంలో సియం నేతృత్వంలో విస్తృతంగా చర్చించనున్నారు.అంతేగాక స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికపై కూడా ఈసమావేశంలో చర్చించనున్నారు.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి.జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి పరిశీలించారు.ప్రధాన వేదిక, సమావేశ ప్రాంగణంలో సిటింగ్ ఏర్పాట్లు,లైటింగ్,పార్కింగ్ తదితర ఏర్పాట్లను వారు పరిశీలించారు.

రెగ్యులర్ గా జరిగే సమావేశాలకు భిన్నంగా సుపరిపాలనలో తొలి అడుగు సమావేశం జరగనుంది. మొత్తం సమావేశ ప్రాంగణంలో ప్రత్యేకంగా రౌండ్ టేబుళ్ళను ఏర్పాటు చేశారు.ఈటేబుళ్ళ వద్ద జిల్లాల వారీగా ఆయా అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి కూర్చుని ఆయా నియోజకవర్గాల్లో ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి,భవిష్యత్ లో చేపట్టబోయే అభివృద్ధి,సంక్షేమ పధకాల ప్రణాళికలపై విస్తృతంగా చర్చిస్తారు.

అంతేగాక వికసిత్ భారత్ లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక అమలు ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టబోయే ప్రణాళికలపై విస్తృతంగా చర్చిస్తారు.సమావేశం అనంతరం అందరితో కలిసి సియం భోజనం చేయనున్నారు.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సమావేశంలో పాల్గొనే ప్రతినిధులు కూర్చునేందుకు ప్రధాన వేదికతో కూడిన రౌండ్ టేబుళ్ళతో సభా ప్రాంగణం సిద్ధమైంది.దానిని ఆనుకుని సమావేశానికి వచ్చిన సియం, డిప్యూటీ సీఎం సియం సహా ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు రాత్రి భోజనం చేసేందుకు మరో ప్రాంగణం ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ వెంట గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి,జెసి భార్గవ్ తేజ్, రాష్ట్ర ప్రణాళికా శాఖ సంయుక్త కార్యదర్శి అనంత శంకర్, గుంటూరు ఆర్డిఓ శ్రీనివాస రావు,ప్రోటోకాల్ అదనపు డైరెక్టర్ మోహన్ రావు,సిఆర్ఖిఏ ఎస్ఇ ధనుంజయ్, గుంటూరు డిఎఫ్ఓ శ్రీనివాస రెడ్డి,ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Latest News

’రైతునేస్తం’.. విజయవంతం..

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. వ్యవసాయం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS