బడిలో తక్కువ సమయం. బాధ్యతల్లో ఎక్కువ సమయం. గురువులు చెప్పిన పాఠాల కన్నా సమాజం నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. కాయకష్టం చేసి కారం మెతుకులు తిని నేర్చిన అక్షరాలు ఆయుధాలే.. విశ్వవిద్యాలయాల్లో అడుగుపెట్టేలా చేసి గ్రామాల్లో రేషన్ బియ్యంతో కడుపునింపిన కుటుంబ బాధ్యతను ఒదిలి యూనివర్సిటీలో కమ్మని మెతుకులు పెట్టిన అక్షరం అమ్మ చేతి...
యువతరం దారి తప్పుతోంది. జల్సాలకు అలవాటుపడి డబ్బు కోసంఅడ్డదారులు తొక్కుతూ జీవితాలను సర్వనాశనం చేసుకుంటోంది. యువతరంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కానీ.. అలాంటి యువత నేడు ఆన్లైన్ బెట్టింగ్లు, మత్తపదార్థాలకు బానిసలై, తలకు మించిన అప్పులు చేస్తూ చివరికి వాటిని తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతూ కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు.
తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు రానే వచ్చాయి. రైతన్నలు దుక్కి దున్ని పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అదునుగా నాసిరకం విత్తనాలు అమ్మేందుకు నకిలీగాళ్లు కొంత మంది అధికారుల అండదండలతో నాయకుల తెరచాటు సపోర్టుతో మార్కెట్లో కాసుకొని కూర్చున్నారు. కాబట్టి రైతన్నలారా జరభద్రం. ప్రభుత్వం మారితే మన బతుకులు మారతాయి అనుకున్నాం. నాణ్యమైన విత్తనాలు లభిస్తాయని...
మూడు ముళ్లు.. ఏడడుగులతో వివాహ బంధం ఏర్పాటుచేసుకున్నాక దంపతులు సంసార జీవితాన్ని సాఫీగా, సంతోషంగా సాగించాలి. జీవన ప్రస్థానంలో కొన్ని సార్లు ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు, ఆలోచనల్లో వ్యత్యాసాలు రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు, బంధుత్వ భేదాలు ఏర్పడొచ్చు. పలుమార్లు పరస్పర అవగాహన లోపం తలెత్తొచ్చు. ఇవన్నీ కలిసి కూర్చొని చర్చించుకుంటే దూరమయ్యే మామూలు...
సమాజాన్ని ముందుకు నడిపించేది హేతుబద్ధ ఆలోచనలే. అంధ విశ్వాసాలు కాదు. కాలానుగుణంగా నిలబడని విశ్వాసాలను ముమ్మాటికీ వదిలేయాలి. ఎందుకంటే అవి ప్రగతి నిరోధకాలు. ఈ భూమిపై జీవ (మానవ) మనుగడ సక్రమంగా జరగాలంటే జీవవైవిధ్యం ప్రధానం. నేడు గతి తప్పిన స్వార్థపూరిత మానవ కార్యకలాపాల మూలంగానే జనజీవన భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ఆలోచన పదునైన...
ఈ రోజుల్లో కొంత మంది యువత లక్ష్యాన్ని మరచి తిరుగుతున్నారు. నిర్లక్ష్యంగా కాలాన్ని గడిపేస్తున్నారు. అడ్డగోలు వ్యవహారాల్లో తలదూర్చుతున్నారు. చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. పనికి రాని విషయాల్లో దూరి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి మరెన్నో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే.. సంతానం తమ కళ్ల ముందే పెరిగిపెద్దయి దారితప్పుతుంటే సరిదిద్దలేక పలువురు పేరెంట్స్ కన్నీరుమున్నీరు...
మన మాటలు ఒక్కోసారి ఎదుటివారిని మానసికంగా గాయపరుస్తాయి. మనం కావాలని అలా అనకపోయినా ఆవేశంలోనో ఆవేదనతోనో వచ్చే మాటలు ఇతరులను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తాయి. కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. మాట అనేది నోటి నుంచి బయటికి వచ్చాక వెనక్కి తీసుకోవటం అసాధ్యం. అందువల్ల జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. మాట అన్నవాడు...
మూడు భాషల సూత్రం జ్ఞానానికి వేదిక, సాంస్కృతిక సామరస్యానికి సాక్షి. తెలుగు మన మాతృభాష, హిందీ జాతీయ ఐక్యతకు వంతెన, ఆంగ్లం ప్రపంచ సాంకేతికతకు తలుపు. ఈ మూడింటినీ అభ్యసించడం వల్ల మనం మన మూలాలను కాపాడుకోగలిగేలా, దేశంతో ఐక్యపడగలిగేలా మరియు ప్రపంచంతో కలిసిపోగలిగేలా సాధ్యమవుతుంది. భాషలు మనుషులను కలిపే శక్తి.. అవి భేదాలను...
జగం మెచ్చిన నాయకుడుజనం నచ్చిన నాయకుడుభరత మాత పుత్రుడుదళిత జాతి సూర్యుడుబాబా అంబేద్కరుడుమను చరిత్రపై దండయాత్రమరువని భారత చరిత్రసమ సమాజానికై సాగినయాత్రఅంతులేని మీ సేవల గాథరాజ్యాంగ రచనకు రథసారధిఆదర్శాల నిర్మాణ వారధిభారత భాగ్య విధాతమా ఉజ్వల భవిష్యతు ప్రధాతమీ ఆశయాలకై మా నిత్య గమనంమీ స్ఫూర్తితో సాగుతాము నిశ్చయంబహుజనులకు అంతులేని గౌరవంభారతదేశ ఆత్మ గౌరవం
బొల్లం...
హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...