అగ్రరాజ్యంలో అమెరికాలో తుపాకి కాల్పుల ఘటనలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. నిత్యం ఎక్కడో చోట కాల్పుల మోత మోగుతూనే ఉంది. దీనిని ముగింపు పలికేందుకు అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తుపాకి హింసను అరికట్టేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. అమెరికాలో...
లెబనాన్ పై ఇజ్రాయెల్ మరోసారి దాడి చేసింది. గురువారం లెబనాన్ లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో 23 మంది మరణించారని లెబనాన్ మీడియా సంస్థలు వెల్లడించాయి. బుధవారం కూడా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ ఘటనలో పదుల కొద్ది పౌరులు ప్రాణాలు కొల్పయారు....
ప్రధాని మోదీ
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు.ఉక్రెయిన్ శాంతిస్థాపన అమలుకు భారత్ కట్టుబడి ఉందని, శాశ్వతమైన, శాంతియుతమైన పరిష్కారాన్ని సులభతరం చేయడానికి అన్నీ మార్గాల్లో భారత్ సిద్ధంగా ఉందని మోదీ అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి వివిధ...
శ్రీలంక అధ్యక్షుడిగా అనురా కుమార్ దిసనాయకే ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి సచివాలయంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య అయినతో ప్రమాణం చేయించారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం జరగ్గా, ఆదివారం నాడు ఓట్ల లెక్కింవు జరిగింది.ఈ ఎన్నికల్లో 75 శాతం ప్రజలు అనురా కుమార్ కే ఓటు వేశారు. అయితే ఈసారి ఎన్నికల్లో...
శ్రీలంకలో అధ్యక్ష పదవికి శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి.ఉదయం 07 గంటల నుండి సాయింత్రం 04 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు.ఈ ఎన్నికల్లో 38 మంది అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు.1.7 కోట్ల మంది ఓటర్లు రేపు పోలింగ్ లో పాల్గొననున్నారు.13,421 పోలింగ్ కేంద్రాలు...
తీవ్ర ఆర్థిక,ఆహార సంక్షోభంతో రెండేళ్ళు అతలకుతలమైన శ్రీలంక ప్రజలు తమ దేశ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సిద్ధమయ్యారు.శనివారం శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో 38 మంది అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు.1.7 కోట్ల మంది ఓటర్లు రేపు పోలింగ్ లో పాల్గొననున్నారు.13,421 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కాశ్మీర్ లో ఎన్నికల నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖావజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.జియో టీవికి అయిన ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ సంధర్బంగా మాట్లాడుతూ,ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ కూటమి స్టాండ్తో తాము ఏకీభావిస్తున్నామని ప్రకటించారు.కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.రెండు పార్టీలు జమ్ముకశ్మీర్ లో గణనీయమైన...
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్
ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పిలుపునిచ్చారు.ఇజ్రాయిల్-పాలస్తీనా ఎన్క్లేవ్ను తిరిగి ఆక్రమించవద్దని సూచించారు.ఇరాన్ శక్తిమంతం కాకుండా పశ్చిమాసియా స్థిరత్వాన్ని సాధించాలని అన్నారు.ఇజ్రాయిల్-గాజా యుద్ధంలో వేల మంది మరణించిన విషయం తెలిసిందే.ఈ యుద్ధంలో ఇప్పటివరకు 41,252 మందికి పైగా మంది మృతిచెందారని,95,497 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య...
సాంకేతిక సమస్యలతో అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన సునీత విలియమ్స్,బుచ్ విల్మోర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.శనివారం స్పేస్ నుండి ఐ.ఎస్.ఎస్ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.అమెరికాలో జరిగే అధ్యక్షుడి ఎన్నికల్లో అంతరిక్షం నుండే ఓటు హక్కు వినియోగించుకుంటామని తెలిపారు.ఓటు వేయడానికి అభ్యర్థన పంపమని,ఇందుకు నాసా సహకరిస్తుందని అన్నారు.అమెరికా పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం తమ కర్తవ్యమని పేర్కొన్నారు.
మంకీపాక్స్ పై పోరాడేందుకు బవేరియన్ నోర్డిక్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం ఆమోదం తెలిపింది.ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి ఇది కీలక ముందడుగు అని తెలిపారు.ముఖ్యమైన ప్రాంతాల్లో తక్షణమే ఈ వ్యాక్సిన్ అందించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.