సీఎం రేవంత్ రెడ్డి
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావుతో కలిసి సమావేశమయ్యారు.
ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగుల డీఏ చెల్లింపు విషయంపై...
దీపావళి పండుగా నేపథ్యంలో సింగరేణి కార్మికులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికులకు దీపావళి బోనస్ ఇవ్వనుంది. దీనికోసం రూ.358 కోట్లు విడుదల చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రతి కార్మికుడి ఖాతాలో శుక్రవారం రూ.93,750 జమ కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు 42 వేల మంది కార్మికులు దీపావళి...
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 01కోటి రూపాయల విరాళం అందించింది. గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేశ్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంవీఎస్ సుధాకర్ విరాళం చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయం...
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పనులు చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్లోని రైల్ నిలయంలో రైల్వే జీఎం అరుణ్కుమార్ తో ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ,గతంలో ఎప్పుడులేని విధంగా దక్షిణ మధ్య రైల్వే బడ్జెట్ను పెంచామని అన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్...
కేంద్రమంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గ్రూప్ 01 అభ్యర్థులు చివరి క్షణం వరకు ఆందోళన చేస్తున్నారని, పంతానికి పోకుండా జీవో 29ని ఉపసంహరించుకోవాలని అన్నారు. నిరుద్యోగుల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని తెలిపారు. 5003 మంది ఎస్సీ, ఎస్టీ,...
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
గ్రూప్ 01 విషయంలో విపక్షా పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఆదివారం గాంధీభవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, విపక్షా పార్టీ ఉచ్చులో నిరుద్యోగులు పడొద్దని అన్నారు. జీవో 29తో అభ్యర్థులకు ఎలాంటి నష్టం...
సోమవారం నుండి జరగబోయే గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 31,382 మంది అభ్యర్థులు గ్రూప్ 01 మెయిన్స్ పరీక్ష రాయనున్నారు. దీని కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో మొత్తం 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు,...
ఒలంపిక్స్ క్రీడల్లో మన దేశానికి ఎక్కువ మెడల్స్ అందించే వాళ్ళు హైదరాబాద్ నుండే ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఆదివారం గచ్చిబౌలిలో జరిగిన ఐఎస్బి సమ్మిట్ లో అయిన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, ప్రపంచదేశాల్లో ఐఎస్బి విద్యార్థులకు మంచి గుర్తింపు ఉందని తెలిపారు. ఐఎస్బి విద్యార్థులు దేశానికి ఆదర్శంగా ఉండాలని...
హైదరాబాద్ లో ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని, చట్టబద్దమైన అనుమతులున్న రియల్ ఎస్టేట్ వెంచర్ల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించింది." చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేస్తారని ప్రచారం చేస్తున్నారు. చెల్లుబాటు అయ్యే అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేయబోమని సీఎం చెప్పారు....
ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. 26న సాయింత్రం 04 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. హైడ్రా ఆర్డినెన్స్కు చట్టబద్దత కల్పించడం,మూసీ బాధితుల అంశంతో పాటు ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు...