55 దేశాల ప్రజలు తమ దేశంలో 240 గంటలు (10 రోజులు) వీసా లేకుండానే జర్నీ చేసే ఆఫర్ను చైనా ప్రకటించింది. ఈ లిస్టులో ఇండోనేషియా, రష్యా, బ్రిటన్ తదితర దేశాలు ఉన్నాయి. టూరిజం సెక్టార్కి బూస్ట్ ఇచ్చేందుకు డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది నేటి (జూన్ 12 గురువారం) నుంచే అమల్లోకి వచ్చింది. ఇంటర్లైన్ టికెట్లు, ఇంటర్నేషనల్ జర్నీకి సంబంధించిన డాక్యుమెంట్లు కంపల్సరీగా ఉండాలి. ఇవి ఉన్నవారు చైనాలోని 24 రాష్ట్రాల్లోని 60 ఓపెన్ పోర్టుల ద్వారా ఎంటర్ కావచ్చు. టూరిస్ట్ ప్లేస్లు, కుటుంబ సందర్శనలు వంటివి చేయొచ్చు. స్టడీ, వర్క్, న్యూస్ రిపోర్టింగ్ వంటివి చేయాలంటే మాత్రం వీసాతోపాటు ముందస్తు అనుమతులు ఉండాలి.