Tuesday, September 16, 2025
spot_img

కూటమి ప్రభుత్వ వేడుక రేపటికి వాయిదా

Must Read

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి (జూన్ 12 గురువారం) సరిగ్గా ఏడాది అయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సర్కారు ఇవాళ సాయంత్రం అమరావతిలో తలపెట్టిన వేడుకలను రేపటికి (జూన్ 13 శుక్రవారం) వాయిదా వేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో ఈ సభను జరపాలనుకుంది. అంతకుముందు ఈ మీటింగ్ పేరును ‘సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్’గా నిర్ణయించి తర్వాత మార్చారు. ఈ మేరకు గుంటూరు జిల్లా అమరావతిలో ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సంవత్సర కాలంలో ఏయే కార్యక్రమాలను అమలుచేశారో, వచ్చే నాలుగేళ్లలో ఏయే లక్ష్యాలను నిర్దేశించుకున్నారో ఈ సమావేశంలో చెప్పాలని భావించారు. ఈ ఉత్సవంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొనాల్సి ఉంది. కానీ.. అనూహ్య పరిస్థితుల్లో రేపటికి వాయిదా వేశారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This