తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రచార కార్యక్రమాల ముఖ్య సభ్యులతో ఈ రోజు(జూన్ 22 ఆదివారం) హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ ఆఫీస్తో సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాల గురించి చర్చించారు.

ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ప్రదీప్ దుగ్యాల, కుమారి బంగారు శృతి తదితర నాయకులు పాల్గొన్నారు.
