కుకట్పల్లిలో ఏపీకి చెందిన ఆరుగురి అరెస్ట్
ఇందులో ఒకరు ఏఆర్ కానిస్టేబుల్
హైదరాబాద్లోని కుకట్పల్లి వివేకానందనగర్లో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోని హైదరాబాద్కు మత్తు పదార్థాలను తరలిస్తున్న ఆరుగురిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.2 కోట్ల విలువైన 840 గ్రాముల కొకైన్, ఎపిడ్రిన్, 5 మొబైల్స్, రూ.50 వేల నగదును సీజ్ చేశారు. నిందితుల్లో ఒకరిని తిరుపతిలోని ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్గా గుర్తించారు. తిరుపతిలో మొదలైన ఈ డ్రగ్స్ ముఠా వ్యవహారం బాపట్ల, గుంటూరు నుంచి హైదరాబాద్ మీదుగా జరుగుతున్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. నిందితులందరూ ఏపీకి చెందినవారేనని చెప్పారు. వీరిలో ఒక మహిళ ఉన్నట్లు వెల్లడించారు. మిగతా నిందితులను.. తిరుపతి రూరల్ ఏరియాకి చెందిన నిరుద్యోగి ఉన్నం సురేంద్ర(31), బాపట్ల జిల్లా కర్లపాలెం మండలానికి చెందిన కాంట్రాక్టర్ దొంతిరెడ్డి హరిబాబు రెడ్డి(38), అద్దంకి మండలానికి చెందిన ఫాస్ట్ ఫియాడ్ నిర్వాహకురాలు చెగుడు మెర్సీ మార్గరేట్(34), షేక్ మస్తాన్వలీ(40), దేవరాజు యేసుబాబు(29). ఈ కేసులో పోలీసు పట్టుబడటం సంచలనం రేపుతోంది.