కేసు నమోదు చేసిన చేవెళ్ల పోలీసులు
ప్రముఖ గాయని మంగ్లీకి చేవెళ్ల పోలీసులు షాక్ ఇచ్చారు. మంగ్లీ బర్త్ డే వేడుకలో మాదకద్రవ్యాలు(డ్రగ్స్) వినియోగించినందుకు ఆమెతోపాటు ఆ పార్టీకి హాజరైన పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ పుట్టిన రోజు సంబరాలు చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్స్లో జరిగాయి. ఆమె పార్టీ ఇచ్చిన ఈ రిసార్ట్స్పై పోలీసులు రైడ్ చేసి భారీఎత్తున గంజాయి, విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. సెలబ్రేషన్స్లో పాల్గొన్నవారికి డ్రగ్స్ పరీక్షలు చేయగా పలువురికి గంజాయి పాజిటివ్ అని వచ్చినట్లు తెలుస్తోంది.