Monday, June 16, 2025
spot_img

యాదాద్రి భువనగిరి జిల్లాలో చెలరేగిపోతున్న భూబకాసురులు

Must Read

(సీలింగ్ ల్యాండ్ ను అడ్డగోలుగా ఆక్రమించిన సాల్వో ఎక్స్ ప్లోజివ్స్ అండ్ కెమికల్స్ యాజమాన్యం..)

  • రాజాపేట్ మండలం, చల్లూరు గ్రామంలోని 322/4 సర్వే నెంబర్ లోని భూమి సీలింగ్ భూమి..
  • రాజకీయ పలుకుబడితో చక్రం తిప్పిన సాల్వో అధినేత జై రాంరెడ్డి..
  • ఇక్కడ పూచికపుల్ల కదలాలన్నా ఈయన గారి అజమాయిషీ ఉండాల్సిందే..
  • అధికార పార్టీ ఎమ్మెల్యే ఇతనికి అండగా ఉన్నాడని వెల్లువెత్తుతున్న విమర్శలు..
  • ప్రభుత్వ భూమిని రక్షించాలని డిమాండ్ చేస్తున్న ట్రెసా అధ్యక్షుడు కొల్లూరి శ్రీనివాసరావు..
  • ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి, సంబంధిత శాఖల పెద్దలకు లేఖ రాసిన వైనం..
  • న్యాయం జరిగేవరకూ పోరాడతానని హెచ్చరిక..

యాదాద్రి భువనగిరి జిల్లాలో భూ బకాసురులు చెలరేగిపోతున్నారు.. ఏకంగా సీలింగ్ ల్యాండ్ ను ఆక్రమించి, అందులో ఒక ఎక్స్ ప్లోజివ్ కెమికల్ కంపెనీ నడుపుతున్నారు.. ఈ కంపెనీని నడపడానికి కూడా ఎలాంటి అనుమతులు లేవని కూడా విమర్శలు వస్తున్నాయి.. ఇక్కడ తయారు చేసే జెలిటిన్ స్టిక్స్ అంటే ప్రేలుడు పదార్ధాలను చత్తిస్ ఘడ్ ప్రాంతానికి అక్రమంగా సరఫరా చేస్తూ మావోయిస్టు లకు అందజేస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చిన సంగతి కూడా విదితమే.. దీనిపై అధికారులు ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది.. అయితే సదరు కంపెనీ అధినేత జైరాంరెడ్డి పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియడం లేదు..

ఈ వ్యవహారం యావత్తూ ఆదాబ్ హైదరాబాద్ ఒక కథనం ద్వారా వెలుగులోకి తెచ్చిన విషయం కూడా విదితమే.. అయితే సీలింగ్ భూమిని ఆక్రమించడం అందులోనే కంపెనీ నడపడం.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఈయన గారిని నిలువరించలేక అధికారులు నిమ్మకుండి పోవడం జరుగుతోంది.. దీనిపై తెలంగాణ రియల్ ఎస్టేట్ బాధితుల సంఘం ( ట్రెసా ) అధ్యక్షులు కొల్లూరి శ్రీనివాస రావు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.. సీలింగ్ భూమిని కాపాడాలని కంకణం కట్టుకున్నారు.. జైరాంరెడ్డిపై పోరాటం కొనసాగిస్తున్నారు.. అది ప్రమాదమని తెలిసినా వెనుకంజ వేయడం లేదు.. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బాటు ప్రధాన తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి,
ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, తెలంగాణ, జిల్లా కలెక్టర్, యాదాద్రి-భువనగిరి, జిల్లా రిజిస్ట్రార్, భువనగిరి అలాగే కమీషనర్ ఆఫ్ కమర్షియల్ టాక్సెస్ అండ్ తెలంగాణ రెరా వారికి కూడా ఫిర్యాదు రూపంలో ఒక లేఖను పంపించడం జరిగింది..
ఆయన తన ఫిర్యాదు ద్వారా, విన్నవించడంలో తీవ్రమైన ప్రజా ఆందోళన, ఆర్థిక, చట్టపరమైన, జాతీయ భద్రతా ప్రాముఖ్యతను వారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది..

యాదాద్రి-భువనగిరి జిల్లా, రాజాపేట్ మండలం చల్లూరు గ్రామంలోని సర్వే నెం. 322/4లో సీలింగ్ భూమిని మోసపూరితంగా ఆక్రమించారని తెలియజేశారు..రాజాపేట మండలం, చల్లూరు గ్రామంలోని సర్వే నంబర్ 322/4లో ఉన్న భూమికి సంబంధించి చైర్మన్ జైరాంరెడ్డి ఆధీనంలో నడుస్తున్న సాల్వో ఎక్స్‌ప్లోజివ్స్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై కొల్లూరి శ్రీనివాస రావు తీవ్రంగా ఫిర్యాదులో పేర్కొన్నారు.. ఇంత ఎంతమాత్రం క్షమార్హం కాదంటూ ఆయన పేర్కొన్నారు..

1954-1955 నాటి ఖాస్రా రికార్డుల ప్రకారం, ఈ భూమి వాస్తవానికి 881 ఎకరాలు, కస్తూరి లింగప్ప, శంకరప్ప పేర్లపై జాబితా చేయబడింది. 1975 సీలింగ్ చట్టం ప్రకారం, ఈ కుటుంబం అదనపు భూమిని ప్రభుత్వానికి అప్పగించింది.. కేవలం 92 ఎకరాలను మాత్రమే తమ అవసరాల నిమిత్తం ఆ కుటుంబం ఉంచుకుంది.

కాగా ప్రభుత్వానికి చెందాల్సిన మిగిలిన 789 ఎకరాల భూమి వ్యవహారంలో ఒక భయంకరమైన వాస్తవం వెలుగు చూసింది..
సదరు జైరాంరెడ్డి ఆ భూములకు సంబంధించిన ఖాస్రా/పహాణీ రికార్డులను అత్యంత చాకచక్యంగా, అక్రమంగా మార్ఫింగ్ చేసి, తారుమారు చేసి, సీలింగ్ ల్యాండ్ లో మిగిలిన భూమిని తన బినామీలకు, ఇంకా కొంతమంది పేర్లతో అక్రమంగా, తప్పుగా నమోదు చేయించాడు..

అయితే భూమిలో ఎక్కువ భాగం సాల్వో ఎక్స్‌ప్లోజివ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీకి సంబంధించిన సహచరులచేత అక్రమంగా అనధికారంగా ఆక్రమించబడి ఉంది.. కాగా ఆక్రమించిన ఈ భూమిలో అనేక భాగాలు ఇప్పటికే.. థర్డ్ పార్టీలకు అమ్మివేయడం కూడా జరిగింది.. ఇది అత్యంత హేయమైన చర్యగా భావిస్తున్నాము.. అత్యంత ప్రమాదకర పరిస్థితిగా భావిస్తున్నాము..

అలాగే కీసర మండలం అంకిరెడ్డిపల్లిలో మరో అక్రమ దందా :

ఇక అదనంగా ఇదే కంపెనీ అంకిరెడ్డిపల్లిలో 200 ఎకరాల భూమిని కబ్జా చేస్తోంది. కీసర మండలంలో ఎలాంటి సరైన టైటిల్ లేకుండా కబ్జా చేస్తోంది..ఇదొక భూ దందా..

Earth demons are rampant in Yadadri Bhuvanagiri district
Earth demons are rampant in Yadadri Bhuvanagiri district

మరొక విషయం ఏమిటంటే గ్రేవ్ నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్.. మావోయిస్ట్ గ్రూపులకు పేలుడు పదార్థాలను సరఫరా చేసినట్లు ఆరోపణలు రావడంతో బాటు బహిర్గతం కూడా కావడం జరిగింది.. ఇక కొన్ని తెలుగు దిన పత్రికల్లో ప్రచురించబడిన ఇటీవలి కథనాల ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు తిరుగుబాటుదారులకు పేలుడు పదార్థాలను సరఫరా చేయడంలో సాల్వో ఎక్స్‌ప్లోజివ్స్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి.. కంపెనీలోని ఉద్యోగులు లేదా సహచరులను భద్రతా ఏజన్సీలు బెదిరింపులకు గురిచేసినట్లు సమాచారం..

ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి :
ఈ అక్రమ ఆక్రమణ, భూ మోసం, బినామీ లకు బదిలీ చేసిన భూములు సుమారుగా 1000 ఎకరాలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.. రూ. 500 కోట్లకు పైగా విలువైన భూములు ఇవి.. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటే ప్రజలకు చెందవలసిన ఈ ఆస్థిని తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు.. అదే విధంగా ల్యాండ్ మాఫియాకు, అక్రమార్కులైన డెవలపర్స్ కు ఒక బలమైన వార్నింగ్ కూడా ఇచ్చినట్లు అవుతుంది..

ఇది చాలా పెద్ద రియల్ ఎస్టేట్ సంక్షోభం.. దీనిపై శాసనసభ జోక్యం తక్షణమే అవసరం :

ఎస్.ఓ.సి. దుర్వినియోగం, ధరణి, నకిలీ ప్లాట్లు పథకాలు, ప్రీ-లాంచ్ స్కామ్‌లు, లిటిగేషన్ భూములు, గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు సర్వ నాశనం అవడం వల్ల లక్షలాది మంది మధ్యతరగతి పెట్టుబడిదారులు దారుణంగా మోసపోయారు. అందుకే తెలంగాణ రెరా చట్టాన్ని మహారాష్ట్ర రెరాతో సమానంగా బలోపేతం చేయాలి. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్‌లో అనధికార నిర్మాణాల కూల్చివేత వంటి సాహసోపేతమైన చర్యలు ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాయి. ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేయాలని, ప్రత్యేక భూసేకరణ అండ్ ప్లాటింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్‌ను అమలు చేయాలని ట్రెసా అధ్యక్షులు కొల్లూరి శ్రీనివాస్ రావు తన లేఖ ద్వారా అభ్యర్ధించారు..

కొన్ని ముఖ్యమైన డిమాండ్స్ ప్రభుత్వం ముందు ఉంచారు..

  1. సర్వే నంబర్ 322/4 యొక్క ఖస్రా/ఫహానీ రికార్డుల మోసపూరిత మ్యుటేషన్‌పై తక్షణ విచారణ చేపట్టాలి..
  2. జైరాంరెడ్డి, అతని కంపెనీలు చట్టవిరుద్ధంగా కలిగి ఉన్న లేదా విక్రయించిన సీలింగ్-మిగులు భూమిని స్వాధీనం చేసుకోవాలి..
  3. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లకు తమవంతు సహకారం అందించిన ఎస్.ఆర్.ఓ. రెవెన్యూ అధికారుల పాత్రపై శాఖాపరమైన విచారణ చేపట్టాలి..
  4. అక్రమంగా పేలుడు పదార్ధాలను సరఫరా చేసినందుకు సాల్వో ఎక్స్‌ప్లోజివ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్య తీసుకోవాలి..
  5. డాక్యుమెంటరీ సాక్ష్యాలను అందించడానికి, మేము సిద్ధంగా ఉన్నాం.. సీఎం అప్పాయింట్ మెంట్ ఇస్తే మరిన్ని యదార్ధాలను వెలుగులోకి తీసుకుని వస్తాం.. ఇందుకు సహకరించాలి..

ప్రజా భద్రత, జాతీయ భద్రత, ఆర్థిక న్యాయం, భూపరిపాలన ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.. ఒక సాహసోపేతమైన చర్య తీసుకుని ప్రజా పాలన అంటే ఏమిటో నిరూపించి, ఇకపై వేలాది కుటుంబాలను మోసపోకుండా కాపాడాలని వారు ట్రెసా అధ్యక్షులు కొల్లూరి శ్రీనివాస్ రావు విజ్ఞప్తి చేస్తూ ఎలాంటి ఆధారాలు కావాలన్నా ప్రభుత్వానికి అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు..

Latest News

ఇరాన్‌లోని మన దేశ పౌరులకు సూచనలు

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌లోని మన దేశ పౌరులకు అక్కడి ఎంబసీ పలు సూచనలు జారీ చేసింది. ప్రస్తుత యుద్ధ పరిస్థితులను చూసి ఎవరూ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS