Tuesday, June 10, 2025
spot_img

మలబద్ధకానికి సులభమైన పరిష్కారం

Must Read

మలబద్ధకంతో బాధపడుతున్నవారు ఇలా చేస్తే వాళ్ల సమస్య పరిష్కారమవుతుంది. నైట్ పడుకోబోయే ముందు.. లైట్‌గా వేడిచేసిన పాలలో ఒక చెంచా ఆవు నెయ్యి కలుపుకొని తాగితే చాలు. తెల్లారేసరికి కడుపు ఖాళీ అవుతుంది. టానిక్ తదితర మందులు వాడటం ద్వారా రిలీఫ్ పొందొచ్చు. కానీ.. న్యాచురల్ పదార్థాలను వాడటం వల్ల లాంగ్‌టర్మ్ లాభాలు ఉంటాయి. నెయ్యి అనేది జీర్ణక్రియను పెంచుతుంది.

పాలు బలమైన పోషకం. ఈ రెండింటినీ కలిపి తాగుతాం కాబట్టి మలబద్ధకం నుంచి తేలిగ్గా బయటపడొచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా దొరుకుతాయి. జీర్ణవ్యవస్థను ప్రభావితం చేసి మలం సాఫీగా విసర్జన అయ్యేలా చూస్తాయి. వెడి పాలు జీర్ణవ్యవస్థ కండరాలను సడలించడంలో సాయపడుతాయి. మలబద్ధకంతోపాటు ఇతర సమస్యలు ఉన్నవాళ్లు ఈ ప్రయత్నం చేసే ముందు ఒకసారి వైద్యుల సలహా తీసుకోవటం ఉత్తమం.

Latest News

మాగంటి గోపినాథ్‌కు ఎన్‌ఆర్‌ఐల నివాళి

జూన్ 8న ఆదివారం ఉదయం కన్నుమూసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత మాగంటి గోపీనాథ్‌కి ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) ఘనంగా నివాళులు అర్పించారు....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS