మానవత్వం చాటుకున్న మాజీ చైర్మన్ చంద్రారెడ్డి
నాగారం మున్సిపాలిటీ లోని వెస్ట్ గాంధీనగర్ రోడ్ నెంబర్.1 కు చెందిన మాటేల మమతా రేకుల ఇళ్లు షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధం కావడంతో ఇంట్లో ఉన్న వస్తువులు, సామాన్లు కాలిపోయాయి. ఈ సంఘటన తెలుసుకున్న నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి విచారణ వ్యక్తం చేస్తూ మానవతా దృక్పథంతో స్వంత నిధులు రూ. 10 వేలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్థిక సాయంపై బాధిత కుటుంబసభ్యులు ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్నారని కొనియాడుతూ, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బిజ్జ శ్రీనివాస్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.