మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ మరికాసేపట్లో కిమ్స్ ఆసుపత్రికి చేరుకోనున్నారు. హరీష్ రావు ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేటీఆర్ ఏసీబీ విచారణ ముగించుకొని తెలంగాణభవన్కి చేరుకున్నాక కూడా హరీష్రావు అక్కడే ఉన్నారు. కేటీఆర్ ప్రసంగిస్తుండగా మధ్యలో ఇబ్బందిగా ఫీలవటంతో వెళ్లిపోయారు.