Tuesday, August 5, 2025
spot_img

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

Must Read

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ ఏప్రిల్‌లో ఆదేశించింది. ఈ ఆదేశాలను దశల వారీగా అమలుచేయాలని అన్ని బ్యాంకులకు, వైట్‌ లేబుల్‌ ఏటీఎమ్‌ ఆపరేటర్లకు సూచించింది. సెప్టెంబర్‌ 30 నాటికి 75 శాతం ఏటీఎమ్‌లలో కనీసం ఒక్క క్యాసెట్‌లోనైనా రూ.100 నోట్లు గానీ రూ.200 నోట్లు గానీ ఉండేలా చూడాలని గడువు విధించింది.

ఈ పర్సంటేజ్‌ను 2026 మార్చి 31 నాటికి 90 శాతానికి చేర్చాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 70 శాతానికి పైగా పెంచటం గమనార్హం. 2024 డిసెంబర్‌లో 65 శాతంగా ఉన్న ఈ లభ్యత ఇప్పుడు 73 శాతంగా ఉంది. దేశంలోనే అతిపెద్ద నగదు నిర్వహణ సంస్థ సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ ఈ విషయాన్ని తెలిపింది. ఈ కంపెనీ.. దేశంలోని మొత్తం 2,15,000 ఏటీఎమ్‌లలో 73,000 ఏటీఎమ్‌లను మెయిన్‌టెయిన్ చేస్తుండటం విశేషం.

Latest News

ఖాజాగూడలో పిడుగు ప్రమాదం

భయాందోళనలో స్థానిక ప్ర‌జ‌లు నగర శివారులోని ఖాజాగూడలో సోమవారం సాయంత్రం పిడుగు పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. లంకోహిల్స్ సర్కిల్‌లోని హెచ్‌పి పెట్రోల్ బంక్ ఎదురు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS