Wednesday, July 23, 2025
spot_img

భారత్‌ మమ్మల్ని చూసి భయపడుతోంది

Must Read

హ్యారీ బ్రూక్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ బుధవారం ప్రారంభం కానుంది. ఈ టెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. అయితే ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఎప్పటిలాగే భారత ఆటగాళ్లను రెచ్చగొట్టే విధంగా టెస్ట్‌ మ్యాచ్‌లు ప్రారంభం కావడానికి ముందే మాట్లాడటం భారత అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. ఇంగ్లాండ్‌ జట్టులో దూకుడుగా ఆడే ఆటగాడిగా పేరున్న హ్యారీ బ్రూక్‌.. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘ఇండియా మమ్మల్ని చూసి భయపడుతుంది’ అని అన్నాడు. నాలుగో టెస్ట్‌కు ముందు ఈ వ్యాఖ్యలు భారత్‌ అభిమానుల్లో ఆగ్రహాన్ని రేపుతున్నాయి.

ఈ విషయంపై హ్యారీ బ్రూక్‌ మాట్లాడుతూ.. ‘‘ఇకపై మేము మంచి పిల్లల్లా మైదానంలో ప్రవర్తించం. క్రికెట్‌ గౌరవాన్ని కాపాడాలని మేము ప్రయత్నించాం. కానీ భారత ఆటగాళ్లు మా జట్టు ఆటగాళ్లను టార్గెట్‌ చేసి దాడి చేశారు. దాన్ని మేము డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి చూశాం. దీని తర్వాత మరుసటి రోజు మేము ఏమి చేయాలో నిర్ణయించుకున్నాం. చివరి ఇన్నింగ్స్‌లో భారత్‌ వైపు దూసుకుపోవాలని నిర్ణయించుకున్నాం. మా ప్రవర్తన కారణంగా భారత జట్టు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. అది తక్కువ స్కోరైనప్పటికీ, పిచ్‌ బ్యాటింగ్‌ చేయడానికి కష్టంగా ఉంది. దీని వల్ల భారత ఆటగాళ్లు నిలబడలేక తమ వికెట్లు కోల్పోయారు. దీని ద్వారా మేము గెలిచాం. ఈ సిరీస్‌లో మేము ఆడే అన్ని మ్యాచ్‌లు చివరి రోజు, చివరి గంట వరకు వెళ్తున్నాయి. చాలా మంది మమ్మల్ని ఈ సిరీస్‌ చాలా అద్భుతంగా ఉందని అభినందిస్తున్నారు.’’ అని హ్యారీ బ్రూక్‌ పేర్కొన్నారు.

‘‘నాతో మాట్లాడిన చాలా మంది వారు చూసిన వాటిలో లార్డ్స్‌ మ్యాచ్‌ అత్యుత్తమమైనది అని చెప్పారు. కాబట్టి మిగిలిన రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల కోసం మేము చాలా ఎదురుచూస్తున్నాం. క్రికెట్‌లో ఎప్పుడూ మైదానంలో 11 మంది ఆటగాళ్లకు, ఇద్దరు ఆటగాళ్లకు మధ్యే పోరాటం. ఇలాగే క్రికెట్‌ పెరిగింది. రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో ఇండియా మాకు చాలా పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి కారణం మమ్మల్ని చూసి వారు భయపడటమే. మేము చాలా పెద్ద లక్ష్యాన్ని చేరుకోగలమని వారు భావించారు. ఇది మాకు అనుకూలంగా మారింది. దీని ద్వారా మా ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అని హ్యారీ బ్రూక్‌ చెప్పాడు.

Latest News

‘హరిహర వీరమల్లు’: నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్‌కు సీబీఎఫ్‌సీ సభ్యులు అక్కల సుధాకర్ అభినందనలు

తెలుగునాట సినిమా, రాజకీయం ఎప్పుడూ కలిసే ప్రయాణిస్తాయి. ఈ రెండు శక్తులు కలిసినప్పుడు, అది ఒక ప్రభంజనం అవుతుంది. ప్రస్తుతం ఆ ప్రభంజనానికి కేంద్ర బిందువుగా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS