పొలిటికల్ లీడర్లు, బిజినెస్మ్యాన్లు, కోటీశ్వరులు స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు కలిగి ఉంటారనే సంగతి తెలిసిందే. 2024లో మన దేశంవాళ్లు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు మూడు రెట్లు పెరిగింది. తద్వారా రూ.37,600 కోట్లకు చేరింది. ఈ విషయాన్ని స్విస్ సెంట్రల్ బ్యాంక్ ఇటీవల తెలిపింది. ఈ బ్యంక్ను 1713వ సంవత్సరంలో స్థాపించారు. 2024లో ఇండియన్ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు సామాన్యులకు బదులు దాని బ్యాంకుల్లో అధిక డబ్బును జమ చేశాయి. ఈ సమయంలో వినియోగదారుల ఖాతాల్లో జమైన డబ్బు 11 శాతం మాత్రమే పెరిగింది. గతేడాదితో పోలిస్తే రూ.3,675 కోట్లు. ఈ సంఖ్య స్విస్ బ్యాంకుల్లో జమ అయిన మొత్తంలో 10 శాతమే.