యేల ఎల్లయ్య తెలుగు కవిత్వ రంగంలో ఆశువు కవిత్వానికి ప్రతీకగా నిలిచిన ప్రముఖ సాహితీవేత్త. బాల్యం నుంచే మాటల్లో మధురతను వెదజల్లగలిగిన ఆయన కవితా ప్రతిభ పటుత్వాన్ని గుర్తించి, అతికొద్ది కాలంలోనే “ఆశువు కవితా కౌశలుడు” అనే బిరుదుతో ప్రజలలో గుర్తింపు పొందారు. వీరి జన్మస్ధలం సిరిపురం అయినప్పటికీ, నల్గొండ జిల్లాలోని వెల్లంకి గ్రామాన్ని తన స్థిరనివాసంగా ఎంచుకుని అక్కడే సాహిత్య సేవ కొనసాగించారు. తల్లిదండ్రులు ముత్తమ్మ, నరసయ్యలు.
జీవిత విశేషాలు
ఈ రచయిత జననం 1906 అక్టోబర్ 13న జరిగింది. ఈ కాలం దేశభక్తి, ధార్మిక చైతన్యం, సమాజంలో మార్పులు ఊపందుకున్న దశ. ఈ ప్రభావాలను ఆయన రచనలపై గమనించవచ్చు సుమారు ఎనిమిదవ దశకానికి చేరినప్పుడు, 1990 ఏప్రిల్ 16న ఆయన మరణించారు.
ఏ. ఎల్లయ్య గారు కేవలం కవిత్వానికే పరిమితమయ్యే వ్యక్తి కాదు. సంప్రదాయ విద్యను గౌరవిస్తూ, రావిటీ పరమేశ్వర సిద్ధాంతి దగ్గర జ్యోతిష్య శాస్త్రం మరియు వ్యాకరణ శాస్త్రాలలో శ్రద్ధతో శిక్షణ పొందారు. అందుకే ఆయనకు “సిద్ధాంత శిరోభూషణ” అనే బిరుదు 1986లో లభించింది. ఇది కేవలం గౌరవ చిహ్నమే కాదు – ఆయన సాధించిన ప్రావీణ్యానికి నిక్షిప్త ఆధారం.
పంచాంగ గణన శాస్త్రంలో ఏ. ఎల్లయ్య ప్రత్యేకంగా రాణించారు. దాదాపు 50 సంవత్సరాలపాటు వివిధ పంచాంగ డైరీలను అధ్యయనం చేసి, జ్యోతిష్య ప్రక్రియల్లోని సూక్ష్మతలను వివరంగా పరిశీలించారు.
ఈయన వ్యాస జీవితం, కవిత్వానికి చేసిన సేవ, జ్యోతిష్యంలో సాధించిన ఆధిపత్యం అన్నీ కలిసి తెలుగు సాహిత్య ప్రపంచానికి విశిష్టమైన సంపదగా నిలుస్తాయి. ఏ. ఎల్లయ్య యొక్క ప్రస్థానం ఒక పరిశోధకుడి దృష్టితో చూసినపుడు, భావకవిత్వం మరియు ఆధారిత విజ్ఞానానికి మాధ్యమంగా మారిన జీవనయాత్రగా అనిపిస్తుంది.శంభులింగ, శశికళ (1979), రామచంద్ర నక్షత్రమాల వంటి రచనలు ముఖ్యంగా సీసపద్యమాలికలుగా వెలువడ్డాయి. ఈ పద్యమాలికలలో ఇతివృత్త శుద్ధి, భావ సమగ్రత, ఛందస్సులో నియమ నిబద్ధత స్పష్టంగా కనిపించడంతోపాటు, కావ్యగంభీరతకు పెద్ద పీట వేశారు.
అంతేకాక, గోపురబంధ కవిత అనే అరుదైన ఛందస్సు ప్రక్రియలోనూ ఆయనకు ప్రావీణ్యం ఉంది. ఇది సంయుక్త పదబంధనంతో కూడిన అధిక నైపుణ్యాన్ని కోరే కవితా శైలి. ఈ శైలిలో రచనలు చేయగల సామర్థ్యం కలిగినవారు తక్కువ మందిలో ఒకరుగా నిలిచారు.
ఈయన సాహిత్య ప్రతిభకు గుర్తింపుగా, 1988లో శతావధాని సి.వి. సుబ్బన్న గారు ప్రత్యేకంగా ప్రశంసలు వెలిబుచ్చారు.
సాహిత్య ప్రక్రియలవారీగా రచనలు
1. శతక & మాలిక సాహిత్యం
ఈ రచయిత రచించిన భార్గవి శతకం మరియు మానస శతకంలు భావాల ఘనతను సూచిస్తాయి. విశిష్టమైన పద ప్రయోగం, శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ భాస్కర మాలిక, వెంకటేశ్వర భాస్కర మాలిక వంటి మాలికలు ఆయన భక్తి సంపత్తిని మనకు పరిచయం చేస్తాయి.
2. యక్షగాన ప్రస్థానం
భద్రాయుపాఖ్యానం, పద్మవ్యూహం, కర్ణార్జున యుద్ధం, సురా బాండేశ్వరం, భల్లాణ చరిత్ర, సీత చర విమోచనం వంటి రచనలు ఆయన యక్షగాన నైపుణ్యాన్ని వివరంగా తెలిపేవి.
3. నాటక సాహిత్యం
బీద రైతు, సీత కళ్యాణం, మార్కండేయ నాటకం, కురుపాండవ యుద్ధ నాట్య గానం వంటి నాటకాలు ఆయన సమకాలీన సమస్యలపై చింతనను ప్రతిబింబిస్తాయి. గ్రామీణ జీవితంలోని బాధలు (బీద రైతు) నుండి పురాణ విలువలు అనే కోణాలు ఈ నాటకాల్లో ప్రతిఫలిస్తాయి.
4. ఆధ్యాత్మిక రచనలు
ఆయన రచించిన చండూరు సీతారామ భజన కీర్తనలు, మార్కండేయ సుప్రభాతం (సంస్కృతంలో), గణపత్యష్టోత్తర శతనామావళి, హిందూ వివాహ విధి వంటి రచనలు భక్తిప్రవాహాన్ని ప్రదర్శించడంతో పాటు సంప్రదాయ విశ్వాసాల ప్రాముఖ్యతను తెలియజేస్తాయి.
5. శాస్త్రీయ గ్రంథాలు
సాహిత్యంతో పాటు శాస్త్రీయ దృక్పథాన్ని కూడా తన రచనలతో పరిచయం చేశారు. తెలుగు క్రియాపదం, సిద్ధాంత గణితం,
భార్గవ శతకం – ఆర్థిక దుస్థితికి వాచ్యం
ఏ. ఎల్లయ్య గారి సాహిత్య ప్రవాహంలో భార్గవ శతకం అనేది ఒక విశిష్టమైన మైలురాయి. మొత్తం 101 పద్యాలతో రచించిన ఈ శతకంలో, కవి తన అంతర్యానాన్ని, సామాజిక జీవితంలోని విరోధాలను, ముఖ్యంగా ఆర్థిక దుర్గతులను మనోగతంతో మేళవించి ఆవిష్కరించారు.
నిలువ నీడ లేక పర
నిందల పాలయితిన్ మనో వ్యధన్
బలువగ దేహంబు గఱగి పాకంబు దప్పిన యనము బొలె సెం
చలనము నొందె చిత్తంబు
అంటూ బాధ ను నిస్సహాయత ను వ్యక్తం చేశారు.ఈ శతకం 1943లో ప్రముఖ ముద్రకుడు కొండా శంకరయ్య గారి ద్వారా ముద్రించబడింది. అయినా, ఈ గ్రంథానికి సరైన పాఠక లోక ప్రచారం లభించలేదు. దీని ముఖ్య కారణం — కవి జీవితం ముడిపడి ఉన్న ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు, వ్యాసంగ అవకాశాల కొరత మొదలైనవే. కుటుంబ బాధ్యత, ఆర్ధిక పరిస్థితుల వలన ఆయన రచనలు చాలావరకు వెలుగులోకి రాలేదు. ఈ శతకంలో కేవలం వర్ణన లేదుగాని, వేదనతో కూడిన విమర్శ మానవతావాదితనం బహుముఖంగా ప్రతిబింబిస్తాయి. కవి తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలను గుణాత్మకంగా విశ్లేషిస్తూ, వాటిని సామాజిక అన్యాయాలపై వ్యతిరేక స్వరం గానూ మలిచారు. గోల్కొండ కవుల సంచికలో ఎల్లయ్య గారి పేరు ప్రస్తావించబడటం వారి ప్రతిభ కు చిన్న గుర్తింపు గా చెప్పవచ్చు.
బిరుదులు
సిద్ధాంత శిరోభూషణ (1986),కవి వ్యాఖ్య,ఇవి ఆయన సాహిత్య కృషికి లభించిన గౌరవా గుర్తింపులు.
కేవలం కవిత్వ సృజనకే కాదు, సామూహిక సాహిత్య కార్యక్రమాలలో, ఆధ్యాత్మిక ప్రేరణతో కూడిన కళాసేవలలోనూ ఎల్లయ్య గారి పాల్గొనడం వారి సామాజిక స్పృహకు నిదర్శనం. చండూర్ మండల సాహితీ మేఖల సాహితీ సంస్థలో ఆయన క్రియాశీలంగా వ్యవహరించారు.
చండూరు సీతారామ దేవాలయంలో జరిగే వార్షిక ఉత్సవాలలో పాల్గొనే వారు. ఈ భక్తిశ్రద్ధే ఆయనకు సాహిత్యంలో ఆధ్యాత్మిక రచన చేయడానికీ దోహదం చేసింది. “చండూరు సీతారామ భజన కీర్తనలు” అనే రచనను చేశారు.
వీరి కృషిని గుర్తించి 1988లో అభిమానులు నిర్వహించిన “అమృత మహోత్సవం” (60వ జయంతి ఉత్సవం) ఒక కవి జీవితంలో అరుదైన ఘట్టం. ఇది ఒక ప్రాంతీయ సాహితీవేత్తకు లభించిన అరుదైన గౌరవం. పున్న అంజయ్య “మరుగుపడిన మణిరత్నం” అనే వ్యాసం ఎల్లయ్య సాహిత్యం పై పరిశోధన ఆవశ్యకత తెలుస్తుంది. సాహిత్య అకాడమీ లు ఈ విషయము పై దృష్టి పెడితే బాగుంటుంది.

డాక్టర్ ఐ.చిదానందం
తెలుగు అధ్యాపకులు
వెల్డండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ
చరవాణి – 8801444335