జూన్ 10న ఐఎస్ఎస్కు శుభాన్షు శుక్లా పయనం
మన దేశానికి చెందిన ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా రేపు (జూన్ 10 మంగళవారం) రోదసీ యాత్రకు బయలుదేరుతున్నారు. యూఎస్ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ యాక్సియమ్ తలపెట్టిన ఈ మానవ సహిత అంతరిక్ష ప్రయోగం పేరు ఏఎక్స్-4. ఈ మిషన్లో భాగంగా ఆయన నింగిలోకి దూసుకెళ్లనున్నారు. స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కి చేరుకుంటారు. తద్వారా.. రాకేష్ శర్మ అనంతరం.. ఐఎస్ఎస్ యాత్ర చేసిన రెండో ఇండియన్గా రికార్డు నెలకొల్పుతారు.
తాజా స్పేస్ జర్నీ మంగళవారం సాయంత్రం 5:52 గంటలకు ప్రారంభమవుతుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఆకాశంలోకి ప్రవేశిస్తారు. శుభాన్షు శుక్లాతో కలిపి పోలండ్, హంగేరీకి చెందిన నలుగురు వ్యోమగాములను ఈ ప్రయోగంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతున్నారు. ఈ మిషన్కి శుభాన్షు శుక్లా పైలట్ కావటం విశేషం. ఇండియాకి చెందిన రాకేశ్ శర్మ 4 దశాబ్దాల కిందట 1984లో ఐఎస్ఎస్కి చేరుకొని ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు.