టెక్సాస్ స్టేట్ యూనివర్సిటీ జరిపిన ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ఐఎస్ఎఫ్) గ్లోబల్ జ్యూనికార్న్ అండ్ ఏఐ సదస్సు 2025లో మన దేశ గ్రామీణ ప్రాంతాల పిల్లలు ప్రతిభను చాటుకున్నారు. ఈ ఇంటర్నేషనల్ సమ్మిట్లో ఇండియన్ స్టూడెంట్స్ 50 మంది తమ ప్రాజెక్టులను ప్రదర్శించి ఔరా అనిపించుకున్నారు. సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సోషల్ డెవలప్మెంట్ తదితర అంశాల్లో వారు రూపకల్పన చేసిన ఆవిష్కరణలు అంతర్జాతీయంగా అభినందనలను సొంతం చేసుకున్నాయి. ఈ సదస్సు ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఐఎస్ఎఫ్ ఫౌండర్ డాక్టర్ జేఏ చౌదరి, ఐఎస్ఎఫ్ యూఎస్ఏ చీఫ్ అట్లూరి సమన్వయంతో సక్సెస్ చేశారు