Friday, July 4, 2025
spot_img

నూతన సీజెఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా

Must Read
  • దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • నవంబర్ 11న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాద్యతలు స్వీకరించనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా
  • వెల్లడించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్

దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. గురువారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంజీవ్ ఖన్నాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 11న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయిన బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్ తెలిపారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఖన్నా ఉన్నారు. ప్రస్తుత సీజేఐ డివై చంద్రచూడ్ స్థానంలో కొత్త న్యాయమూర్తి నవంబర్ బాధ్యతలు స్వీకరిస్తారు. అక్టోబర్ 18, 2024న డివై చంద్రచూడ్ సిఫార్సును అనుసరించి ఈ నియామకం జరిగింది. డివై చంద్రచూడ్ నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS