అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్
‘కుబేర’ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ఆ మూవీ టీమ్ అంచనా వేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ‘కుబేర’ చిత్రం ఈ నెల 20న వరల్డ్వైడ్గా విడుదలైంది. ఫస్ట్ షో నుంచే ఫస్ట్ క్లాస్ ఫిల్మ్ అంటూ పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. ‘కుబేర సినిమా చాలా బాగుంది’ అనే మౌత్ పబ్లిసిటీ మరింత ప్లస్ అయింది. దీంతో.. ఈ పిక్చర్.. బాక్సాఫీస్ను బద్ధలుకొట్టింది. కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్.. ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. తమ చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్యూ అని పేర్కొంది. ‘కుబేర’ ఘన విజయంపై సినిమా ప్రియులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3 గంటలకు పైగా రన్టైమ్ కలిగిన ‘కుబేర’లో రష్మిక హీరోయిన్. ముఖ్యంగా భిక్షగాడి పాత్రలో ధనుష్ నటన అద్భుతం అని చెబుతున్నారు.