Friday, October 17, 2025
spot_img

శ్రీశైలం డ్యాం సమీపంలో చిరుత మరణం

Must Read

ఈరోజు ఉదయం సుమారు 7 గంటల 10 నిమిషాల ప్రాంతంలో ఒక చిరుత పులి రోడ్డుపైన చనిపోయినదని స్థానికులు అటవీశాఖ అధికారులకు తెలుపగా అటవీశాఖ అధికారులు శ్రీశైలం డ్యాం సమీపంలో ఉన్న రహదారి ప్రహరీ గోడ పక్కన చూడగా ఒక సుమారు 8 నెలల మగ చిరుత పులి చనిపోయి ఉన్నది. ఇట్టి చిరుత పులిని అటవీశాఖ అధికారులు ముందుగా ఏదైనా వాహనము ఢీకొన్నదని అనుమానించినారు కానీ ఇట్టి చిరుతపులిని పూర్తిగా పరిశీలించి చిరుత పులి శరీరం పైన మరియు మెడ భాగం పైన గోళ్ళ యొక్క ఆనవాళ్లు గమనించినారు ఇట్టి చిరుత పులి వేరే ఇతర అడవి జంతువుతో పోరాడి చనిపోయినట్లు నిర్ధారించినారు, తదుపరి వెటర్నరీ డాక్టర్ గారిని సంప్రదించి ఇట్టి చిరుత పులిని పోస్టుమార్టం జరిపించగా, వెటర్నరీ డాక్టర్ గారి పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం ఇట్టి చిరుత పులి ఇతర జంతువులతో పోరాడి గాయపడినట్లుగాను మరియు శరీరం పైన ఏ విధమైన వాహనాలు ఢీకొన్న ఆనవాళ్లు గాని లేవు కాబట్టి ఇట్టి చిరుత పులి వేరే ఇతర జంతువు వల్లనే సహజ మరణం పొందిందని తెలిపినారు, అటవీశాఖ అధికారులు ఇట్టి చిరుతపులి యొక్క కళేబరాన్ని దహనం చేసినారు. ఇట్టి కార్యక్రమంలో సుశాంత్ IFS, గురు ప్రసాద్ ఎఫ్ ఆర్ వో దోమల పెంట, డాక్టర్ అనిల్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ గారు మరియు దోమల పెంట రేంజ్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This