మన దేశం, రాష్ట్రం ఏదైనా సమ్మిళిత అభివృద్ధి సాధించాలంటే పార్టీ(నాయకుల)ల మధ్య ఆధిపత్య కొట్లాట కాదు. రాజకీయాల్లో పారదర్శకత, నైతికత అవసరం. సామాజిక, ఆర్థిక న్యాయం ప్రతి వర్గానికి అందాలె. ఎన్నికల ముందు యువత, రైతుల, మహిళ.. ఇలా ఓటున్న అన్ని వర్గాలను దేవుళ్లు అంటారు. ఎన్నికల్లో ఓట్లుగా వాడుకుంటారు. పార్టీలు ఏవైనా, నాయకులు ఎవరైనా అధికారం కోసం వాగ్దానాల (మేజిక్) వరద.. ఆల్ఫ్రీగా అని ఆశపెడతారు. అంతేకాదు. ఫ్రీ భవిష్యత్తు కూడా వాగ్ధానంగా వాడుకుంటారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ(నాయకు)లు మారినా.. నాటకాలు మారలేదు. ప్రజలు ఓటేసి పాలకులను చేస్తే ఓటర్లుగా మోసపోతూ గోసపడుతూ ఇంతకన్నా పెద్ద విధ్వంసమే లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు
- మేదాజీ