హైదరాబాద్, హయత్నగర్కు చెందిన వ్యాపారవేత్త మహేష్ జూలూరు, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మహేష్ జూలూరుకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా మహేష్ జూలూరు మాట్లాడుతూ, “ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యాపారంలో రాణించాలంటే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం తప్పనిసరి. తెలుగు AI బూట్ క్యాంప్లో నేర్పిన టూల్స్ నా వ్యాపార ప్రక్రియలను సులభతరం చేయడానికి, మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ నైపుణ్యాలతో నా వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లగలననే నమ్మకం కలిగింది. ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ 2.0 ఆగస్టు 11, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686, 733 111 2688.