Thursday, October 30, 2025
spot_img

ఇండియా, పాకిస్థాన్ బోర్డర్‌లో మోడ్రన్ ఫెన్సింగ్

Must Read

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) నిర్ణయం

భద్రత విషయంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ముఖ్య నిర్ణయం తీసుకుంది. బోర్డర్‌లో ఫెన్సింగ్‌ను ఆధునికీకరించనుంది. పాకిస్థాన్‌తో ఉన్న సరిహద్దులోని పాత ఫెన్సింగ్ స్థానంలో కొత్త ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు అధునాతన భద్రతను జోడించనుంది. చొరబాట్లకు, అక్రమ కార్యకలాపాలకు చెక్ పెట్టనుంది. కొత్త ఫెన్సింగ్ వల్ల బిఎస్ఎఫ్ మెరుగైన నిఘాను, రెస్పాన్స్‌ను పొందనుంది. ఈ మోడ్రన్ ఫెన్సింగ్ సరిహద్దు భద్రతను శక్తిమంతం చేస్తుంది.

ఇందులో భాగంగా యాంటీ కట్ డిజైన్ టెక్నాలజీని వాడతారు. దీనివల్ల ఫెన్సింగ్‌ను అంత ఈజీగా కట్ చేయలేం. కాబట్టి శత్రువుల చొరబాటు అసాధ్యం. బోర్డర్ వెంబడి ప్రతి మూమెంట్‌ను పర్యవేక్షించే కెమెరాలు, సెన్సార్లు, ఇతర నిఘా పరికరాలు ఉంటాయి. ఈ ఫెన్సింగ్‌లో సీసీటీవీ కెమెరాలను అమర్చుతారు. ఇవి సరిహద్దులో ఏ కదలికనైనా ఇట్టే పసిగడతాయి. చొరబాట్లను, అనుమానాస్పద కార్యకలాపాలను సెన్సర్లు కనిపెడతాయి.

రాజస్థాన్‌లోని ఇండో-పాక్ బోర్డర్‌లో కొత్త ఫెన్సింగ్‌ను ఏర్పాటుచేస్తున్నారు. పంజాబ్‌లోనూ కొత్త ఫెన్సింగ్ ఏర్పాటుచేస్తారు. జమ్మూకాశ్మీర్‌లోని ఎల్‌ఓసీలో, బంగ్లాదేశ్ సమీప సరిహద్దులో కొత్త ఫెన్సింగ్ ఏర్పాటుచేస్తారు. స్నిఫర్ డాగ్‌ల సంఖ్యనూ పెంచుతారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This