గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు.. దృశ్యం-3 రాబోతుంది అంటూ మోహన్ లాల్ చేసిన ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ ట్వీట్లో.. దర్శకుడు జీతూ జోసెఫ్, నిర్మాత ఆంటోని పెరుంబవూర్తో కలిసి దిగిన ఫొటోను షేర చేశారు. దృశ్యం సిరీస్లో మూడో పార్ట్ గురించి స్వయంగా మోహన్ లాల్ ప్రకటించడం అభిమానులకు సంతోషం కలిగిస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. దృశ్యం-3 స్క్రిప్ట్ వర్క్ను ఇప్పటికే పూర్తిచేశామని డైరెక్టర్ జీతూ జోసెఫ్ చెప్పటం గమనార్హం.