మరింత మెరుగైన మానవ వనరుల అభివృద్ధి సాధిస్తామని ప్రతిజ్ఞ
నేషనల్ హెచ్ఆర్డీ నెట్వర్క్ (ఎన్హెచ్ఆర్డీఎన్) హైదరాబాద్లోని బంజారాహిల్స్ ప్రాంతంలో తన అత్యాధునిక కార్యాలయాన్ని శనివారం ప్రారంభించింది. ఇది దేశవ్యాప్తంగా మానవ వనరుల అభివృద్ధి విషయంలో మరింత ముందుకు వెళ్లడం, ఎక్స్లెన్స్, సృజనాత్మకత, సుస్థిరాభివృద్ధి దిశగా తన కృషిని చాటడంలో ఎన్హెచ్ఆర్డీఎన్ నిబద్ధతకు ఒక నిదర్శనం.
నాయకత్వం, అభివృద్ధి, వృత్తిగత సర్టిఫికేషన్ ప్రోగ్రాంలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ఇది ఒక కేంద్ర కార్యాలయంగా రూపొందుతుందని ఎన్హెచ్ఆర్డీఎన్ హైదరాబాద్ విభాగం ప్రారంభించిన ఈ కలల ప్రాజెక్టు సూచిస్తోంది. అందరికీ ఉపయోగపడే ప్రాంతం, చర్చలకు ప్రోత్సాహం, నిరంతర అభ్యాసం, వివిధ రంగాల్లోని హెచ్ఆర్ నిపుణుల మధ్య పరస్పర విధానాల మార్పిడి లాంటి వాటన్నింటికీ ఇది ఒక చక్కటి వేదికగా నిలిచేలా అద్భుతంగా ఈ భవనాన్ని తీర్చిదిద్దారు.
దేశంలో బలమైన మానవ పెట్టుబడి పునాది వేయడానికి తమ సమిష్టి కృషికి నిదర్శనంగా ఈ కొత్త కేంద్రం నిలుస్తుందని ఎన్హెచ్ఆర్డీఎన్ హైదరాబాద్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ విపుల్ సింగ్ అన్నారు. హెచ్ఆర్ వృత్తినిపుణులకు ఇది ఒక డైనమిక్ వ్యవస్థను అందిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మారుతున్న పని వాతావరణం నేపథ్యంలో ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని పంచుకోవడం, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం అత్యంత కీలకమని వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న హెచ్ఆర్ నిపుణులు వృత్తిపరంగా ఎదిగేందుకు తాము గణనీయంగా కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
పరిశ్రమ, విద్యాసంస్థలతో పాటు వివిధ రంగాల్లో మానవనరులను మరింత బలోపేతం చేయాలన్న ఎన్హెచ్ఆర్డీఎన్ లక్ష్యాన్ని ఈ అత్యాధునిక కేంద్రం మరింత బలపరుస్తుంది. భారతదేశానికి భవిష్యత్తుకు ఉపయోగపడే, అత్యంత నైపుణ్యంతో కూడిన వర్క్ ఫోర్స్ను రూపొందించాలన్న విస్తృత జాతీయ లక్ష్యానికి ఇది మద్దతు ఇస్తుంది.
ఈ కొత్త భవనం వల్ల కలిగే విస్తృత ప్రభావం గురించి ఎన్హెచ్ఆర్డీఎన్ జాతీయాధ్యక్షుడు ప్రేమ్ సింగ్ ఇలా వివరించారు. “నైపుణ్యాలు, నాయకత్వాలను పోషించాలన్న ఎన్హెచ్ఆర్డీఎన్ జాతీయ నిబద్ధతను ఈ హైదరాబాద్ కార్యాలయ ప్రారంభం ప్రతిబింబిస్తుంది. హెచ్ఆర్ వృత్తి నిపుణులకు సాధికారత కల్పించడంలో ఈ కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. తద్వారా ఇది వివిధ సంస్థలను, దేశవ్యాప్తంగా సమాజాన్ని కూడా బలోపేతం చేస్తుంది” అని చెప్పారు.

ఎన్హెచ్ఆర్డీఎన్ భవన ప్రారంభోత్సవంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ. కె. రామకృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్హెచ్ఆర్డీఎన్ మాజీ అధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు , ఇంకా పలువురు విశిష్ట అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఎన్హెచ్ఆర్డీఎన్ గురించి:
నేషనల్ హెచ్ఆర్డీ నెట్వర్క్ (ఎన్హెచ్ఆర్డీఎన్) అనేది వృత్తి నిపుణులకు సంబంధించిన జాతీయ సంస్థ. ఇది ప్రధానంగా దేశంలో మానవ వనరుల అభివృద్ధికి కృషి చేస్తుంది. వివిధ వృత్తినిపుణులు, ప్రధానంగా హెచ్ఆర్ నిపుణుల సామర్థ్యాలను బలోపేతం చేయడం, అంతర్జాతీయ స్థాయిలో వారిని తీర్చిదిద్దడం, మొత్తం సమాజాభివృద్ధికి తద్వారా తోడ్పడడం దీని ప్రధాన లక్ష్యాలు. 1986లో ప్రారంభించిన ఎన్హెచ్ఆర్డీఎన్ పూర్తి స్వతంత్ర, లాభాపేక్ష లేని, వాలంటీర్లతో నడపబడే, అత్యంత ప్రొఫెషనల్గా నిర్వహించే సంస్థ. విద్య, శిక్షణ, పరిశోధన, విజ్ఞానాన్ని పంచుకోవడం లాంటి చర్యల ద్వారా మానవ వనరుల సమగ్రాభివృద్ధికి ఇది కట్టుబడి ఉంటుంది.

పలు బహుళజాతి సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఎంఎస్ఎంఈలు, ఎన్జీవోల నుంచి 21వేలకు పైగా వృత్తినిపుణులు సభ్యులుగా ఉన్న ఎన్హెచ్ఆర్డీఎన్.. వృత్తినిపుణులకు, పరిశ్రమలకు కూడా కీలకమైన వనరుల కేంద్రంగా సేవలందిస్తోంది. దేశంలో ఈ నెట్వర్క్కు 58 చాప్టర్లు ఉన్నాయి. ఇంకా సింగపూర్, దుబాయ్, నేపాల్ లాంటి దేశాలలోనూ చాప్టర్లతో అంతర్జాతీయంగా కూడా విస్తరించింది.