Friday, October 3, 2025
spot_img

ఎన్టీపీసీ నోటిఫికేషన్,ఇంటర్ తో రైల్వే ఉద్యోగం

Must Read

దేశవ్యాప్తంగా వివిధ రైల్వేజోన్లలో ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యూయేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్న 3445 పోస్టులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20 వరకు ఆన్లైన్ లో ధరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు అక్టోబర్ 20న ముగిసిన తర్వాత అక్టోబర్ 21,22 తేదీల్లో రూ.500 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్ జెండర్స్, ఎక్స్ సర్వీస్‎మెన్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.రెండు దశల్లో రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికార వెబ్‎సైట్ ని సంప్రదించవచ్చు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This