- ఫిర్యాదు చేస్తే స్పందించిన నాధుడే కారువు.
- గత వారం రోజులుగా మట్టి తరలిస్తున్న చడి చప్పుడు లేదు.
- అధికారుల ప్రగల్బాలు ప్రకటనల వరకేనా?
- మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఉన్నట్టా, లేనట్టా.?
- సంబంధిత శాఖ అధికారులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. పోలీసులు.
మట్టిని తరలించే అక్రమార్కులు రాత్రి పగలు తేడా లేకుండా కొన్ని వందల టిప్పర్ల మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారుల నుండి అనుమతులు పొందకుండానే ఎదేచ్చగా మట్టి అక్రమ రవాణా జరుపుతుండగా మైనింగ్ రెవెన్యూ ఇరిగేషన్ పోలీస్ అధికారులు శిలా విగ్రహాలుగా ఉండిపోతున్నారే తప్ప ఫిర్యాదులు చేసిన పట్టించుకునే నాధుడే కరువయ్యారు. పూర్తి వివరాలలోకి వెళ్తే.. చివ్వెంల మండల కేంద్రంతో పాటు మోదినిపురం, రాజ్ తండా, వట్టి ఖమ్మం పహాడ్, తిమ్మాపురం, వల్లభాపురం, ఉండ్రుగొండ, దురాజ్ పల్లి ,పాశ్య నాయక్ తండ,అక్కల దేవి గూడెం, చందుపట్ల గ్రామాలలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు నుండి పెద్ద ఎత్తున అక్రమంగా మట్టి త్రవ్వకాలు జరుగుతున్న అధికారులు నిమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.

మోదిన్ పురం గ్రామంలో గత వారం రోజులుగా చైన్ మిషన్ జెసిబి తో , 20 టిప్పర్లు రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద ఎత్తున మట్టి తరలిస్తున్నారు. ప్రధాన రహదారుల గుండా వెళ్తే ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారని, ఖాసింపేట శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ కట్ట పై నుండి గంట వారి గూడెం, మున్యా నాయక్ తండ, చివ్వెంల గ్రామ శివారులోని రావుస్ ఫార్మా బ్యాక్ సైడ్ ఉన్న ఎస్సారెస్పీ కెనాల్ వద్ద నుండి సూర్యాపేట కు వందల టిప్పర్ల మట్టి తరలిస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత శాఖ మైనింగ్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన ఏ అధికారి కూడా స్పందించడం (ఫోన్ ఎత్తడం లేదు) లేదంటూ ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం సంబంధిత శాఖ అధికారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ఈ అక్రమ మట్టి తరలింపు అడ్డుకోవాలని, మట్టి మాఫియా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గ్రామస్తులు పలువురు కోరుతున్నారు.
